స్టాప్ నర్స్ ఉద్యోగనికి ఎంపికైనా చందుర్తి యువతి - మార్త శిల్ప
చందుర్తి, ( న్యూస్ ఇండియా ప్రతినిధి కోక్కుల వంశీ )
On
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలకేంద్రానికి చెందిన యువతి స్టాఫ్ నర్స్ ఉద్యోగం సాధించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన స్టాఫ్ నర్స్ ఉద్యోగ నియామక ఫలితాల్లో చందుర్తి మండలకేంద్రానికి చెందిన మార్త శిల్ప స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. వివరాల్లోకి వెళ్తే చందుర్తి మండలకేంద్రానికి చెందిన మార్త రాజు పుష్ప దంపతుల కుమార్తె మార్త శిల్ప తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన స్టాఫ్ నర్స్ ఉద్యోగ నియామక పరీక్షల్లో అత్భుతమైన ప్రతిభ కనబరిచి ఉద్యోగానికి ఎంపికయ్యారు.
శిల్ప స్టాఫ్ నర్స్ ఉద్యోగనికి ఎంపిక కావడంతో చందుర్తి మండలకేంద్రానికి చెందిన గ్రామస్తులు సైతం ఆనందం వ్యక్తం చేయడంతో పాటు, శిల్ప తల్లిదండ్రులకు పలువురు అభినందనలు తెలియజేశారు. మార్త శిల్ప ఇంతకు ముందు రుద్రంగి మండలం మానాల గ్రామంలో సబ్ సెంటర్లో యం యల్ హెచ్ పి గా చేశారు.
Views: 210
Tags:
About The Author
Post Comment
Latest News
25 Feb 2026 13:16:36
కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..
కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం ర్యాలీ, డిమాండ్..
నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 25, న్యూస్...

Comment List