స్టాప్ నర్స్ ఉద్యోగనికి ఎంపికైనా చందుర్తి యువతి - మార్త శిల్ప

చందుర్తి, ( న్యూస్ ఇండియా ప్రతినిధి కోక్కుల వంశీ )

On
స్టాప్ నర్స్ ఉద్యోగనికి ఎంపికైనా చందుర్తి యువతి  - మార్త శిల్ప

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలకేంద్రానికి చెందిన యువతి స్టాఫ్ నర్స్ ఉద్యోగం సాధించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన స్టాఫ్ నర్స్ ఉద్యోగ నియామక ఫలితాల్లో చందుర్తి మండలకేంద్రానికి చెందిన మార్త శిల్ప స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. వివరాల్లోకి వెళ్తే చందుర్తి మండలకేంద్రానికి చెందిన మార్త రాజు పుష్ప దంపతుల కుమార్తె మార్త శిల్ప తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన స్టాఫ్ నర్స్ ఉద్యోగ నియామక పరీక్షల్లో అత్భుతమైన ప్రతిభ కనబరిచి ఉద్యోగానికి ఎంపికయ్యారు. IMG-20240129-WA0058శిల్ప స్టాఫ్ నర్స్ ఉద్యోగనికి ఎంపిక కావడంతో చందుర్తి మండలకేంద్రానికి చెందిన గ్రామస్తులు సైతం ఆనందం వ్యక్తం చేయడంతో పాటు, శిల్ప  తల్లిదండ్రులకు పలువురు అభినందనలు తెలియజేశారు. మార్త శిల్ప ఇంతకు ముందు రుద్రంగి మండలం మానాల గ్రామంలో సబ్ సెంటర్లో యం యల్ హెచ్ పి గా చేశారు.

Views: 209
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో)ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు,వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.కావున కాలి...
వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'