స్టాప్ నర్స్ ఉద్యోగనికి ఎంపికైనా చందుర్తి యువతి - మార్త శిల్ప

చందుర్తి, ( న్యూస్ ఇండియా ప్రతినిధి కోక్కుల వంశీ )

On
స్టాప్ నర్స్ ఉద్యోగనికి ఎంపికైనా చందుర్తి యువతి  - మార్త శిల్ప

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలకేంద్రానికి చెందిన యువతి స్టాఫ్ నర్స్ ఉద్యోగం సాధించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన స్టాఫ్ నర్స్ ఉద్యోగ నియామక ఫలితాల్లో చందుర్తి మండలకేంద్రానికి చెందిన మార్త శిల్ప స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. వివరాల్లోకి వెళ్తే చందుర్తి మండలకేంద్రానికి చెందిన మార్త రాజు పుష్ప దంపతుల కుమార్తె మార్త శిల్ప తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన స్టాఫ్ నర్స్ ఉద్యోగ నియామక పరీక్షల్లో అత్భుతమైన ప్రతిభ కనబరిచి ఉద్యోగానికి ఎంపికయ్యారు. IMG-20240129-WA0058శిల్ప స్టాఫ్ నర్స్ ఉద్యోగనికి ఎంపిక కావడంతో చందుర్తి మండలకేంద్రానికి చెందిన గ్రామస్తులు సైతం ఆనందం వ్యక్తం చేయడంతో పాటు, శిల్ప  తల్లిదండ్రులకు పలువురు అభినందనలు తెలియజేశారు. మార్త శిల్ప ఇంతకు ముందు రుద్రంగి మండలం మానాల గ్రామంలో సబ్ సెంటర్లో యం యల్ హెచ్ పి గా చేశారు.

Views: 211
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
మహబూబాబాద్ జిల్లా – తొర్రూరు: న్యాయవాదిపై జరిగిన దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు.న్యాయవాదిపై దాడి చేయడం తీవ్రంగా...
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు
అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..
మాకు ఈ టీచర్ వద్దు.. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి
కార్పొరేట్ విధానాలను నిరసిస్తూ జైలు భరో
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఐ ప్రజా చైతన్య ప్రచార యాత్ర
ఏపీ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం..