పర్యావరణాన్ని కాలుష్యమయం చేయటమా..?

స్పందించని మున్సిపల్ కమిషనర్..

On
పర్యావరణాన్ని కాలుష్యమయం చేయటమా..?

అబ్దుల్లాపూర్మెట్, ఫిబ్రవరి 13 (న్యూస్ ఇండియా ప్రతినిధి): ఇబ్రహీంపట్నం నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే సొంత గ్రామంలో మున్సిపల్  సిబ్బంది,, అధికారుల నిర్లక్ష్యం. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ తొర్రూర్ రాజీవ్ గృహకల్ప కాలనీ వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఇష్టం వచ్చినట్లుగా చెత్తను తగలబెడుతున్న మున్సిపల్ సిబ్బంది. స్థానికులు సమాచారం ఇవ్వడానికి కమిషనర్ కు ఫోన్ చేస్తే స్పందించని మున్సిపల్ కమిషనర్.. జననివాసం ఉన్న చోట పర్యావరణాన్ని కాపాడవలసిన మున్సిపల్ సిబ్బందే  ఇష్టానుసారంగా చెత్తను తగలబెట్టి పర్యావరణాన్ని కాలుష్యమయం చేయటం ఏంటని

IMG_20240213_11321107
మున్సిపల్ సిబ్బంది చెత్తను తగలబెడుతున్న దృశ్యం..

స్థానికులు ప్రశ్నిస్తున్నారు. జననివాసం ఉన్న చోట అనాధికారికంగా చెత్తను డంపు చేయటం వల్ల దోమలు విపరీతంగా పెరిగి అనారోగ్య పాలయితున్నామని కాలనీవాసులు ఆవేదన  వ్యక్తం చేస్తున్నారు.

Views: 58

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News