మూడు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతిభ చాటిన కందుకూరి సోని...

By Ramesh
On
మూడు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతిభ చాటిన కందుకూరి సోని...

IMG-20240219-WA1436

ప్రస్తుతం సివిల్ ఎస్ఐ గా ట్రైనింగ్ లో.... 

కానిస్టేబుల్ గా, గ్రూపు ఫోర్త్ ఫలితాలలో జూనియర్ అసిస్టెంట్ గా..... 

న్యూస్ ఇండియా తెలుగు, ఫిబ్రవరి 19 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)

Read More భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు

ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీతమైన పోటీ ఉన్న ఈ రోజుల్లో ఒక ఉద్యోగం సాధించాలంటే ఎంతో కష్టపడాలి..!. అలాంటిది.. ఉమ్మడి వరంగల్‌ ,  జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కొన్నే గ్రామానికి చెందిన  కందుకూరి సోనీ గౌడ్..
ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా  మూడు  ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై ప్రశంశలు అందుకుంటుంది. గ్రామానికి చెందిన కందుకూరి బుచ్చమ్మ- శంకరయ్య దంపతుల చిన్న కుమార్తె సోనీ గౌడ్,నిరుపేద కుటుంబంలో పుట్టి ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు తన సొంత గ్రామమైన కొన్నే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. పై చదువుల కోసం జిల్లా కేంద్రమైన జనగామలో ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఈడీ, పూర్తి చేశారు. అనంతరం పై చదువుల కోసం వరంగల్ జిల్లా కేంద్రంలోని హనుమకొండ లో ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ జీనియస్ ( సీఈఓ రాము)ఎస్ ఐ,  కోచింగ్ సెంటర్లో, 2022, 2023 సంవత్సరంలో కోచింగ్  తీసుకున్నారు.  ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడి చదివి పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించారు. అనంతరం సివిల్ ఎస్సై సాధించారు.ఆ రెండింటిలో ఎస్సై పోస్టు ఎంచుకున్నారు...
ఇటీవల ప్రకటించిన గ్రూప్‌-4 ఫలితాల్లో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం  సివిల్  పోలీసు  సబ్ ఇన్స్పెక్టర్
హైదరాబాదులోని రాజేంద్రనగర్ శిక్షణలో ఉన్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క, సారక్క ,  జాతరలో విధులు నిర్వహిస్తున్నారు .  మూడు,  ఉద్యోగాలు సాధించిన  కందుకూరి సోనీ గౌడ్ ను ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులు, గ్రామస్థులతో పాటు, జిల్లా, మండల, గ్రామ, గీత కార్మిక నాయకులు, పలువురు గ్రామస్తులు అభినందించారు.

Read More అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.

Views: 2401
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.