మూడు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతిభ చాటిన కందుకూరి సోని...
ప్రస్తుతం సివిల్ ఎస్ఐ గా ట్రైనింగ్ లో....
కానిస్టేబుల్ గా, గ్రూపు ఫోర్త్ ఫలితాలలో జూనియర్ అసిస్టెంట్ గా.....
న్యూస్ ఇండియా తెలుగు, ఫిబ్రవరి 19 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)
ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీతమైన పోటీ ఉన్న ఈ రోజుల్లో ఒక ఉద్యోగం సాధించాలంటే ఎంతో కష్టపడాలి..!. అలాంటిది.. ఉమ్మడి వరంగల్ , జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కొన్నే గ్రామానికి చెందిన కందుకూరి సోనీ గౌడ్..
ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై ప్రశంశలు అందుకుంటుంది. గ్రామానికి చెందిన కందుకూరి బుచ్చమ్మ- శంకరయ్య దంపతుల చిన్న కుమార్తె సోనీ గౌడ్,నిరుపేద కుటుంబంలో పుట్టి ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు తన సొంత గ్రామమైన కొన్నే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. పై చదువుల కోసం జిల్లా కేంద్రమైన జనగామలో ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఈడీ, పూర్తి చేశారు. అనంతరం పై చదువుల కోసం వరంగల్ జిల్లా కేంద్రంలోని హనుమకొండ లో ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ జీనియస్ ( సీఈఓ రాము)ఎస్ ఐ, కోచింగ్ సెంటర్లో, 2022, 2023 సంవత్సరంలో కోచింగ్ తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడి చదివి పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. అనంతరం సివిల్ ఎస్సై సాధించారు.ఆ రెండింటిలో ఎస్సై పోస్టు ఎంచుకున్నారు...
ఇటీవల ప్రకటించిన గ్రూప్-4 ఫలితాల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం సివిల్ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్
హైదరాబాదులోని రాజేంద్రనగర్ శిక్షణలో ఉన్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క, సారక్క , జాతరలో విధులు నిర్వహిస్తున్నారు . మూడు, ఉద్యోగాలు సాధించిన కందుకూరి సోనీ గౌడ్ ను ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులు, గ్రామస్థులతో పాటు, జిల్లా, మండల, గ్రామ, గీత కార్మిక నాయకులు, పలువురు గ్రామస్తులు అభినందించారు.
Comment List