పేదల భూ పోరాటంపై పోలీసుల దాష్టికం...

అనచివేతలతో భూ పోరాటాలను ఆపలేరు...

By Ramesh
On
పేదల భూ పోరాటంపై పోలీసుల దాష్టికం...

సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సుంచు విజేందర్....

న్యూస్ ఇండియా తెలుగు, మార్చి 17 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)

 

 జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్నరాంచర్ల గ్రామ శివారులో గల 174 సర్వేనెంబర్ భూమి ప్రభుత్వ అసైన్డ్ భూమిలో ఇండ్లులేని నిరుపేదలు సిపిఎం ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకుంటుంటే పోలీసులు అక్రమంగా, పోలీసు బలగాలతో పేద ప్రజలను చుట్టుముట్టి పేద ప్రజలపై పిడి గుద్దులు గుద్దుతూ సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు సుంచు విజేందర్ ను బలవంతంగా ఈడ్చుకెళ్ళి పోలిస్ వ్యాన్లో పడేసి, ఆయనతోపాటు మరో ఆరుగురిని అరెస్టు చేసి,నర్మెట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం సాయంత్రం సొంత పూచికత్వం విడుదల చేశారు. ఈ సందర్భంగా సుంచు విజేందర్ మాట్లాడుతూ 174 సర్వే నెంబర్ లో ఉన్న 8 - 16 భూమి పై ఉన్న స్టేటస్కోను జిల్లా రెవిన్యూ కోర్ట్ రద్దుచేసి, ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న దని ,అట్టి భూమిని మండలంలోని ఇండ్లు లేని నిరుపేదలకు పంచాలని, దశలవారీగా పోరాటం చేసి చివరకు సిపిఎం ఆధ్వర్యంలో పేదలందరూ ఎర్రజెండాలు చేతపట్టి గుడిసెలు వేస్తున్న క్రమంలో పోలీసులు కర్కశంగా మహిళలపై మగ పోలీసులు విరుచుకుపడి పిడుగులు గుద్ది ప్రజలను చల్లా చెదురు చేసే ప్రయత్నం చేశారన్నారు. దీంతో పోలీసుల మధ్య పేదల మధ్య తోపులాట జరిగిందన్నారు. ఈ మండలంలో కొంతమంది భూ కబ్జాదారులు పట్టి భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్న రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. అణచివేతలతో భూ పోరాటాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఉవ్వెత్తున ఉద్యమాలు ఎగిసిపడతాయి అన్నారు. పెదలు వేసుకున్న గుడిసెలను రెవెన్యూ సిబ్బంది పోలీసులు తొలగించారు. గుడిసెలు తొలగించిన భూ పోరాటం ముందుకు పోతది తప్ప వెనక్కు తగ్గదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు రామగల్లా అశోక్, వెంకటవ్వ, భూ పోరాట కమిటీ కన్వీనర్ పర్వతం నర్సింలు, అన్న బోయిన రాజు, రాములు, రాజవ్వ, మనీ , ఎల్లయ్య, ఈదమ్మ ,శోభ, కరుణాకర్, బాలరాజు, యాదగిరి, నరేష్, తదితరులు పాల్గొన్నారు.IMG-20240316-WA1316IMG-20240316-WA0983IMG-20240316-WA1345IMG-20240316-WA1344

Views: 295
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*