రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ కార్పొరేషన్ చేర్మెన్ గా మానాల మోహన్ రెడ్డి

On
రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ కార్పొరేషన్ చేర్మెన్ గా మానాల మోహన్ రెడ్డి

రుద్రంగి, మార్చి17, న్యూస్ ఇండియా కోక్కుల వంశీ ప్రతినిధి

రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రస్తుత రాజన్న సిరిసిల్ల  జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామానికి నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా 37 మంది కార్పొరేషన్ చైర్మన్ లను ప్రభుత్వం నియమించగా మానాల మోహన్ రెడ్డి కి ఆ జాబితాలో చోటుదక్కింది.

FB_IMG_1710688472304

సీఎం రేవంత్ రెడ్డికి అనుచరిడిగా ఉన్న మానాల మోహన్ రెడ్డి జిల్లా, రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలలో కీలక పాత్ర పోషించడంతో పాటు పలు ఎన్నికలకు ఇంచార్జి గా పనిచేశారు. ఊరు పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న మానాల మోహన్ రెడ్డి ఆయన రాజకీయా ప్రస్థానం మొట్టమొదటి సరిగా కోనసముందర్ సొసైటీ డైరెక్టర్ గా, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా, కోనసముందర్  సొసైటీ కి రెండు సార్లు చేర్మెన్ గా, రాష్ట్ర పిసిసి అధికార ప్రతినిధి గా, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు పోషిస్తూ చెరగని ముద్ర వేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీలో ఉన్నప్పటికీ టికెట్ రాలేదు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని అప్పగించింది.

Read More అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి

Views: 103
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం.. బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..
జనప్రియ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎలిసియం విల్లా ప్రాజెక్ట్‌ను త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ఘనంగా ప్రారంభించారు.
అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి
అధికారులు సర్వే చేసి భూములకు శాశ్వత హద్దులు నిర్ణయించాలి
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్