చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వడం శుభ పరిణామం
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈతాప రాములు
On
భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ను కేటాయించడం మంచి శుభ పరిణామం అని జిల్లా జాయింట్ సెక్రెటరీ పాశం స్వామి అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి ని నియమించినందుకు కాంగ్రెస్ పార్టీకి సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కి మరియు సీనియర్ నాయకులకు పార్టీ అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పార్టీ కోసం గత 20 సంవత్సరాలుగా సేవ చేసిన కిరణ్ కుమార్ రెడ్డికి భువనగిరి ఎంపీ టికెట్ ఇవ్వడం శుభపరిణామం అన్నారు ప్రతి కార్యకర్త కష్టపడి భువనగిరి ఎంపీగా అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని ఆయన కోరారు. అసెంబ్లీ ఎన్నికలలో నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన విధంగా భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని కూడా గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
Views: 79
About The Author
Related Posts
Post Comment
Latest News
01 Jun 2025 19:20:10
తెలంగాణ పోలీస్ సేవ పథకము" కి ఎంపికైన చిల్పకుంట్ల వాసి..
ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు..
తెలంగాణ పోలీస్ సేవ పథకము" కి ఎంపికైన చిల్పకుంట్ల వాసి...
Comment List