మహిళా ఉద్యోగిపై సెక్రటరీ వేధింపులు తొర్రూర్ పీఏసీఎస్ లో ఘటన

ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి అధికారులు పంటించుకోడం లేదు దళిత సంఘాల ఆరోపణ

మహిళా ఉద్యోగిపై సెక్రటరీ వేధింపులు తొర్రూర్ పీఏసీఎస్ లో ఘటన

IMG_20240412_114241 మహబుబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ఓ మహిళ పనిచే స్తుండగా సెక్రటరీగా పనిచేస్తున్న వెలుగు మురళి వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వెలుగు మురళి సెక్రట రీగా వచ్చినప్పటి తనను లైంగికంగా వేధిస్తున్నాడని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసినా అధికారులకు పట్టింపు లేదని దళిత సంఘాలు ఆరోపించాయి. మురళి సెక్రటరీ పదోన్నతి పొందినప్పటి నుంచి వేధింపులు ఎక్కువైనట్లు బాధితురాలు వాపోయిం ది. సదరు సెక్రటరీకి తోటి ఉద్యోగులు సహకరించ డంతో మరింత రెచ్చిపోయడాని ఆరోపించింది. లొంగకపోయే సరికి విధుల విషయంలో తప్పిదాలు వెతికి బెదిరింపులకు పాల్పడుతున్నాడని పేర్కొంది. ఉద్యోగులకు జీతాలు పెంపు విషయంలో అందరికీ రూ.4వేలు పెంచి తనకు మాత్రం రూ.2వేలు పెంచా డని ఆరోపించింది. ఇప్పటికైనా ప్రాథమిక సహకార పరపతి సంఘం అధికారులు స్పందించి మురళిని సస్పెండ్ చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి.

దారుణంగా టార్చర్..

తనను వేధించవద్దని ప్రాధేయపడినా మారకపోవ డంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితు

మాట్లాడుతున్న దళితసంఘాల నాయకులు

Read More అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..

రాలు పేర్కొంది. అధికారుల అండ చూసుకొని ఉద్యోగినులతో పాటు కింది స్థాయి వర్కర్లపై క్రూరంగా ప్రవర్తిస్తున్నాడని వాపోయింది. పోలీసులు దర్యాప్తు చేపట్టి కీచక సెక్రటరీ మురళిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. మహిళ వేధింపు విషయంలో వెలుగు మురళి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తొర్రూరు ఎస్సీ జగదీష్ బాబు తెలిపారు. ఎఫ్ఎఆర్ నమోదు చేసి డీఎస్పీకి పంపించినట్లు జగదీష్ బాబు తెలిపారు.

Read More తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...

మురళికి ఇంత ఆస్తులు ఎక్కడివి..?

వెలుగు మురళికి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆయన కుటుంబంలోని ప్రతి ఒక్కరిపై తొర్రూరు పీఏసీఎస్ లో లోన్స్ ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికా రుల అండతో అక్రమంగా సంపాదించారని ఆరోప ణలు వినిపిస్తున్నాయి

Views: 103
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌... తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా, భూమి చైర్మన్‌ ఎండీ రకమ్‌ సింగ్‌ రాణా, సినీ నటుడు హరీష్‌కుమార్‌ ప్రత్యేక అతిథులుగా, ఎంజీవన్‌ భూమి చైర్మన్‌, ఎండీ కొత్త...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు
అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..
మాకు ఈ టీచర్ వద్దు.. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి