*మూడేళ్లలోనే 30 టన్నుల దిగుబడి*

*- సాంప్రదాయ పంటల స్థానంలో పామాయిల్ సాగు* *- ఆదర్శంగా నిలుస్తున్న ఆయిల్ ఫామ్ రైతు అంజయ్య* *తొర్రూరు:*

*మూడేళ్లలోనే 30 టన్నుల దిగుబడి*

*మూడేళ్లలోనే 30 టన్నుల దిగుబడి*
*- సాంప్రదాయ పంటల స్థానంలో పామాయిల్ సాగు*
*- ఆదర్శంగా నిలుస్తున్న ఆయిల్ ఫామ్ రైతు అంజయ్య*
*తొర్రూరు:*IMG-20240416-WA0040

ఏటా సాంప్రదాయ పంటల సాగుతో విసిగిపోయిన రైతు తూర్పాటి చిన్న అంజయ్య ఆయిల్ ఫామ్ పంట సాగు చేసి మూడేళ్లలోనే దిగుబడి సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
మండల వ్యాప్తంగా 1100 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పంట సాగవుతుండగా తొలి దిగుబడిని సాధించాడు.
మూడేళ్ల ఆరు నెలల కాలంలో 30 టన్నుల దిగుబడిని సాధించి ఆదర్శంగా నిలిచాడు.
 

మంగళవారం మండలంలోని కంటాయపాలెం శివారులో 30 ఎకరాల్లో సాగుచేసిన ఆయిల్ ఫామ్ పంట దిగుబడిని 
ఉద్యాన శాఖ డివిజన్ అధికారి రాకేష్ తో కలిసి రైతు, ఎంపీపీ అంజయ్య చూపించారు.

ఈ సందర్భంగా రైతు అంజయ్య మాట్లాడుతూ....

Read More పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ

పైలెట్ ప్రాజెక్టు కింద 30 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పంట సాగు చేశానని,90 శాతం సబ్సిడీతో డ్రిప్ మొక్కలు  అందాయన్నారు. సాగుకై ఎకరాన రూ. 20 వేలు ఖర్చు చేశానని, ఆయిల్ పెడ్, ఉద్యాన శాఖల నుంచి సహకారం అందిందని తెలిపారు. అంతర పంటలుగా పత్తి, పెసర, వేరుశనగ పంటలు వేశానని పేర్కొన్నారు.
ఈ ఏడాది జనవరి నుంచి పంట దిగుబడి మొదలైందని ఇప్పటివరకు 30 టన్నుల దిగుబడి సాధించినట్లు తెలిపారు. టన్నుకు రూ.14,437 వస్తుందని, ఆయిల్ పెడ్ వాళ్లే పంటను అశ్వరావుపేట పరిశ్రమకు తరలిస్తారని తెలిపారు.
వరికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించే లక్ష్యంతో ఆయిల్‌పామ్‌ సాగుచేసే రైతుల కు రాయితీలు ఇస్తోందన్నారు. కంపెనీలు గ్యారెంటీ ధరలతో రైతుల వద్ద దిగుబడులను కొనుగోలు చేస్తుండటంతో రైతులు ఆయిల్‌ పాం సాగువైపు దృష్టి సారిస్తున్నారన్నారు.
సాంప్రదాయ పంటలైన వరి , పత్తి వంటి పంటలను సాగు చేసి నష్టపోవడం కంటే ఆయిల్ ఫామ్ పంట సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని కోరారు.

Read More రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..

ఈ కార్యక్రమంలో స్థానికులు రాఘవరెడ్డి, సమ్మాల్ తదితరులు పాల్గొన్నారు.

Read More అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినం..

Views: 114
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..