భువనగిరిలో బిజెపి జెండా ఎగరడం ఖాయం : పబ్బు వెంకటేశ్వర్లు
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ తో గడప గడపకు ప్రచారం
On
న్యూస్ ఇండియా తెలుగు, మే 5 (నల్లగొండ జిల్లా ప్రతినిధి) :కట్టంగూరు మండల పరిధిలోని ఐటిపాముల గ్రామంలో భువనగిరి పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డాక్టర్ బుర్ర నర్సయ్య గౌడ్ గెలుపు కొరకు కట్టంగూరు మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పబ్బు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గడపగడపకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ తో ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ముక్తకంఠంతో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీని గెలిపిస్తామని అన్నారు. అదేవిధంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితి లేదు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మి ,బూత్ అధ్యక్షురాలు జూలూరి నాగరాజు అదేవిధంగా బెజవాడ సంతోష్, కంబాల పెళ్లి సైదులు, బొమ్మ గోని నాగరాజు, అనంతల శంకర్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Views: 73
About The Author
Related Posts
Post Comment
Latest News
11 Apr 2026 10:09:08
ఖమ్మం ఏప్రిల్ 10 ఖమ్మం న్యూస్ ప్రతినిధి:
ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ భానోత్ రెడ్డి ఆధ్వర్యంలో కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు....

Comment List