పెద్దమ్మ తల్లికి పంచలోహ కీరటం

పంచలోహ కీరటాన్ని ఎన్​ఆర్​ఐ స్టూడెంట్​ గుండెల వినయ్​బాబు బహుకరించారు.

పెద్దమ్మ తల్లికి పంచలోహ కీరటం

IMG-20240515-WA0028

 మహబూబాబాద్​లోని గోపాలపురం శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహానికి పంచలోహ కీరటాన్ని ఎన్​ఆర్​ఐ స్టూడెంట్​ గుండెల వినయ్​బాబు బహుకరించారు.  ఈ సందర్భంగా శ్రీ పెద్దమ్మ తల్లి ట్రస్ట్​ కార్యదర్శి ముత్యాల శ్రీనివాస్​, సలహారుడు సింగని అశోక్​లు మాట్లాడుతూ ట్రస్ట్​ ఛైర్మన్​ గుండెల రాజు, రేణుక దంపతుల పెద్ద కుమారుడు, ఎన్​ఆర్​ఐ స్టూడెంట్​ గుండెల వినయ్​ బాబు శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహానికి పంచలోహ కీరటం బహుకరించినట్లు తెలిపారు. రూ.26వేల విలువైన పంచలోహ కీరటం అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి అమర్చినారు. పంచలోహ కీరటాన్ని తొర్రూరు మండలం కంఠాయపాలెం గ్రామానికి చెందిన శోభన్​బాబు అనే శిల్పి తయారు చేసినట్లు వివరించారు. అనంతరం వినయ్​బాబును టెంపుల్​ ట్రస్ట్​, నడిగడ్డ, హన్మంతుని గడ్డ ముదిరాజు పెద్దలు ఘనంగా అభినందించి, సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్​ ఛైర్మన్​ గుండెల రాజు, ఉపాధ్యక్షుడు కొండ సారయ్య, కార్యదర్శి ముత్యాల శ్రీనివాస్​, కోశాధికారి భూముల వెంకన్న,  సలహాదారులు సింగని అశోక్​, అల్వాల వెంకన్న, హన్మంతునిగడ్డ, నడిగడ్డ ముదిరాజు సంఘం అధ్యక్షులు భూం నాగరాజు, కొప్పు ఉప్పలయ్య, కార్యదర్శులు పుచ్చ బాలకృష్ణ, వెములకొండ మల్లేశ్​, కోశాధికారులు తోట శ్రీనివాస్​, భూం నర్సయ్య, పుచ్చ వెంకటయ్య, ట్రస్ట్​ డైరెక్టర్లు, సంఘ సభ్యులు పులుగుజ్జ ఐలయ్య, చెన్నబోయిన సోమయ్య, తోట యాదగిరి, వెములకొండ ఐలయ్య, కట్ల శ్రీనివాస్​, ఉషయ్య, వీరన్,  గుర్రం నరేశ్​, రాజు తదితరులు ఉన్నారు.

Views: 141
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News