ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

జిల్లాలో ధాన్యం  కొనుగోళ్లను  వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు.

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

IMG-20240516-WA0070

గురువారం కలెక్టర్   కార్యాలయంలో ధాన్యం కొనుగోలు పై  అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ లెనిన్ వత్సల్  టొప్పో ,అదనపు కలెక్టర్ రెవెన్యూ డేవిడ్ తో కలిసి సంబంధిత అధికారులతో  సమీక్షించారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  2023-24 రబీ సీజన్లో జిల్లాలో మొత్తం కొనుగోలు కేంద్రాలు 192 ఉండగా అందులో ధాన్యం సేకరణ 102  కొనుగోలుకేంద్రంల ద్వారా 4909 మంది రైతుల నుండి  ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు.

ఇప్పటి వరకు 24,658 మెట్రిక్ టన్నులు సేకరించడం జరిగిందని,దాని విలువ 54.27 కోట్లు ఉంటుందని అన్నారు.

తూకం వేసిన ధాన్యాన్ని సంబంధిత మిల్లర్లకు రవాణా చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 

 వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ధాన్యాన్ని  వర్షాలకు తడవకుండా ఉండేందుకు టార్పాలిన్లను ఉపయోగించాలని అన్నారు.

ధాన్యం సేకరణకు తగినన్ని లారీలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని   సేకరించాలని  సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఖరీఫ్ 2023-24 సంబంధించిన ధాన్యం మిల్లుల ద్వారా మరాడించి బియ్యం త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఆర్డిఓ అలివేలు, తొర్రూర్ ఆర్డిఓ నరసింహారావు, డిఎం సివిల్స్ కృష్ణవేణి, డి సి ఓ వెంకటేశ్వర్లు,
డి ఎస్ ఓ రాజేందర్, డీఈఓ అభిమానులు మెక్మా విజయ ఐకెపి నళిని లు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Views: 62
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..