ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

జిల్లాలో ధాన్యం  కొనుగోళ్లను  వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు.

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

IMG-20240516-WA0070

గురువారం కలెక్టర్   కార్యాలయంలో ధాన్యం కొనుగోలు పై  అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ లెనిన్ వత్సల్  టొప్పో ,అదనపు కలెక్టర్ రెవెన్యూ డేవిడ్ తో కలిసి సంబంధిత అధికారులతో  సమీక్షించారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  2023-24 రబీ సీజన్లో జిల్లాలో మొత్తం కొనుగోలు కేంద్రాలు 192 ఉండగా అందులో ధాన్యం సేకరణ 102  కొనుగోలుకేంద్రంల ద్వారా 4909 మంది రైతుల నుండి  ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు.

ఇప్పటి వరకు 24,658 మెట్రిక్ టన్నులు సేకరించడం జరిగిందని,దాని విలువ 54.27 కోట్లు ఉంటుందని అన్నారు.

Read More వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...

తూకం వేసిన ధాన్యాన్ని సంబంధిత మిల్లర్లకు రవాణా చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 

Read More జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'

 వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ధాన్యాన్ని  వర్షాలకు తడవకుండా ఉండేందుకు టార్పాలిన్లను ఉపయోగించాలని అన్నారు.

Read More నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!

ధాన్యం సేకరణకు తగినన్ని లారీలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని   సేకరించాలని  సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఖరీఫ్ 2023-24 సంబంధించిన ధాన్యం మిల్లుల ద్వారా మరాడించి బియ్యం త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఆర్డిఓ అలివేలు, తొర్రూర్ ఆర్డిఓ నరసింహారావు, డిఎం సివిల్స్ కృష్ణవేణి, డి సి ఓ వెంకటేశ్వర్లు,
డి ఎస్ ఓ రాజేందర్, డీఈఓ అభిమానులు మెక్మా విజయ ఐకెపి నళిని లు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Views: 60
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..