స్వచ్ఛ ఆదిభట్ల కార్యక్రమంలో పాల్గొన్న: మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి..

On
స్వచ్ఛ ఆదిభట్ల కార్యక్రమంలో పాల్గొన్న: మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి..

ఇబ్రహీంపట్నం, జులై 03 (న్యూస్ ఇండియా ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బుధవారం ఉదయం ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛ ఆదిభట్ల కార్యక్రమంలో భాగంగా, మంగళపల్లి పటేల్ గూడలో మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్ర, అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా వార్డులలో వివిధ శాఖల అధికారులతో కలిసి గడపగడపకు తిరుగుతూ ప్రజలకు ఉన్న సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు వర్తింప చేస్తామని అన్నారు. మంగళపల్లి పటేల్ గూడ లోని ప్రధాన రహదారి పక్కన పేరుకుపోయిన మురికి, చెత్తా చెదారాన్ని జెసిబి ద్వారా తొలగించారు. ఇరిగేషన్ అధికారులను స్పాట్ వద్దకు పిలిచి తాసిల్దార్ తో ఫోన్లో మాట్లాడి సర్వే చేసి వాగు అద్దురాలను గుర్తించి రానున్న రోజులలో వాకింగ్ ట్రాక్  ఏర్పాటు చేద్దామని సూచించారు. మరి ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత చాలా ముఖ్యమని అన్నారు. ప్రజల సౌకర్యార్థం వీధి దీపాలు, త్రాగునీరు, తక్షణమే ఏర్పాటు చేస్తామని తెలిపారు. వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి డ్రైనేజీ చెత్తాచెదారం ఉన్నచోట వాటిని వెంటనే తొలగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిభట్ల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కామండ్ల యాదగిరి, కమిషనర్ బాలకృష్ణ, మాజీ జెడ్పిటిసి పొట్టి ఐలయ్య, మాజీ సర్పంచ్ భాస్కర్ గౌడ్, మర్రి రామ్ రెడ్డి, గ్రామ పెద్దలు, కాలనీవాసులు, యువకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Views: 89

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ తప్పులు చేస్తే భారీ జరిమానా.. రైల్వే రూల్స్ తెలుసా? రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ తప్పులు చేస్తే భారీ జరిమానా.. రైల్వే రూల్స్ తెలుసా?
భారతీయ రైల్వేలో ప్రయాణించే వారికి ముఖ్యమైన హెచ్చరిక. ధూమపానం, టికెట్ లేకుండా ప్రయాణం, మహిళల కోచ్‌లో ప్రయాణం, అనుమతి లేకుండా వస్తువుల అమ్మకాలపై అమల్లో ఉన్న రైల్వే...
ఏకాంత సేవ తర్వాత తిరుమల గర్భగుడిలో ఏం జరుగుతుంది? ఈ ఆధ్యాత్మిక రహస్యాలు మీకు తెలుసా?
చీమలా కనిపిస్తుంది.. తాకితే యాసిడ్ పోసినట్లే! ఏపీలో ఈ ప్రమాదకర పురుగు కలకలం
బాలయ్యతో కొరటాల శివ సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన నారా లోకేష్.. రూ.200 కోట్ల పాన్ ఇండియా మూవీ!
ప్రియుడి కోసం కాబోయే మొగుడ్ని బలిచ్చిన అందాల రాక్షసి.. లోహగడ్ కోటపై పక్కా మర్డర్ స్కెచ్!
రూ.400 కే హైదరాబాద్ TO గోవా టూర్.. ఫుల్ డిటైల్స్ మీ కోసం..!
గాడ్స్ ఓన్ కంట్రీ కేరళలో ఏం చూడాలో తెలుసా?