తొర్రూర్ ఆర్యభట్ట స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

డ్రైవరు మద్యం  మత్తులో ఉండడమే ఇది కారణం.... స్వల్ప గాయాలతో బయటపడ్డ 30 మంది చిన్న పిల్లలు 

తొర్రూర్ ఆర్యభట్ట స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

తొర్రూర్ ఆర్యభట్ట స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

డ్రైవరు మద్యం  మత్తులో ఉండడమే ఇది కారణం 

చెట్ల పొదల్లోకి దూసుకెళ్లి షర్టును ఢీకొన్న బస్సు 

స్వల్ప గాయాలతో బయటపడ్డ 30 మంది చిన్న పిల్లలు 

Read More బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..

తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వని స్కూల్ యాజమాన్యం 

డ్రైవర్ను దాచిపెట్టి పిల్లల్ని కూడా ఎవరికి చూపించని యాజమాన్యం 

పిల్లల తల్లిదండ్రులు 100 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో వచ్చిన పోలీసులు 

ఉదయం స్కూల్ పిల్లలని ఎక్కించుకొని వస్తున్న ఆర్యభట్ట స్కూల్ బస్సు అదుపుతప్పి చెట్లపొదలకు దూసుకెళ్లి చెట్టును ఢీకొన్న సంఘటన మహబూబాబాద్ జిల్లా తోరూరు మండలం చీకటాయపాలెం గ్రామంలో సోమవారం ఉదయం 7:40 ప్రాంతంలో చీకటాయపాలెం గ్రామం చెర్లపాలెం గోపాలగిరి గ్రామాలలో పిల్లల్ని ఎక్కించుకొని చీకటాయపాలెం  గ్రామం నుండి బయలుదేరిన కొద్ది నిమిషాల్లోనే బస్సు డ్రైవరు మధ్యం మత్తులో ఉండడంతో చెట్లపొదలకు దూసుకెళ్లి చెట్టును డీకొని సడన్గా ఆగడంతో పిల్లలకి స్వల్ప గాయాలు అయినాయి వెంటనే తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం డ్రైవర్ను దాచిపెట్టి వేరే డ్రైవర్ను పంపించి పిల్లల్ని కూడా స్కూల్లోనే ఉంచుకున్నారు. కనీసం పిల్లల్ని హాస్పిటల్ కి తీసుకెళ్లి ఫస్ట్  కూడా చేయించకుండా స్కూల్లోనే ఉంచుకోవడం గమనార్హం.
స్కూల్ బస్సు మీద ఒక నెంబరు ఉంచి దానిపై స్టిక్కర్ వేసి ఇంకో నెంబర్ మీద బస్సు నడిపించడం చూసే వాళ్ళని ఆశ్చర్యం చేస్తుంది. ఇంత పెద్ద డివిజన్ కేంద్రంలో ఎన్నో స్కూలు ఉన్నా.... అధికారులు కూడా ఇంక నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం చాలా ఆశ్చర్యమేస్తుంది అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు 
ఆర్యభట్ట స్కూల్లో ఇలాంటి స్కూలు బస్సు సంఘటనలు రెండు మూడు పర్యాయాలు జరిగిన స్కూలు యాజమాన్యం తీరు మార్చుకోకపోవడం అధికారులు పట్టించుకోకపోవడం ఇంతవరకు న్యాయమో అర్థం కావడం లేదని తల్లిదండ్రులు వాపోయారు ఇకపైనా అయిన జిల్లా కలెక్టర్, డీఈఓ, ఆర్టీవో వారు స్పందించి ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నారు.

Views: 216
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం.. బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..
జనప్రియ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎలిసియం విల్లా ప్రాజెక్ట్‌ను త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ఘనంగా ప్రారంభించారు.
అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి
అధికారులు సర్వే చేసి భూములకు శాశ్వత హద్దులు నిర్ణయించాలి
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్