వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో

పాల బిల్లుల కోసం పాడి రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొంది

By Venkat
On
వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో

ధర్నా చేస్తున్న పాడి రైతులు

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ IMG-20240809-WA0300

పెండింగ్ పాల బిల్లులు చెల్లించాలంటూ వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. 

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై విజయ డైరీలో పాలు పోస్తున్న రైతులు, తమకు రావలసిన ఐదు విడతల బిల్లులు చెల్లించడం లేదంటూ ఆందోళన చేశారు. విజయ డైరీ ఎండికి మొరపెట్టుకున్న ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎక్కడికి వెళ్తారో అంటూ తలా తక లేని సమాధానం చెప్పారని మండిపడ్డారు.పాల బిల్లులు చెల్లించడం లేదని పలుమార్లు ఎమ్మెల్యేలకు, మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పశు సంవర్థక శాఖను తన వద్ద ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి 2 సార్లు తీసుకెళ్లిన సమస్య తీర లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాడి రైతుల పిలుపుమేరకు జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. ఇదేమి రైతు సంక్షేమ ప్రభుత్వమని విమర్శించారు. బిల్లులు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ఆందోళనలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో సాదం రమేష్, వడ్లురి వేంకటాద్రి, గోడిశాల వెంకటయ్య, G కుమార్, కాసాని నాగరాజు, కత్తుల రాజు, చొక్కం రాములు, పండుగ రవి, మునిగల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Views: 6
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..