వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో

పాల బిల్లుల కోసం పాడి రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొంది

On
వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో

ధర్నా చేస్తున్న పాడి రైతులు

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ IMG-20240809-WA0300

పెండింగ్ పాల బిల్లులు చెల్లించాలంటూ వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. 

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై విజయ డైరీలో పాలు పోస్తున్న రైతులు, తమకు రావలసిన ఐదు విడతల బిల్లులు చెల్లించడం లేదంటూ ఆందోళన చేశారు. విజయ డైరీ ఎండికి మొరపెట్టుకున్న ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎక్కడికి వెళ్తారో అంటూ తలా తక లేని సమాధానం చెప్పారని మండిపడ్డారు.పాల బిల్లులు చెల్లించడం లేదని పలుమార్లు ఎమ్మెల్యేలకు, మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పశు సంవర్థక శాఖను తన వద్ద ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి 2 సార్లు తీసుకెళ్లిన సమస్య తీర లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాడి రైతుల పిలుపుమేరకు జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. ఇదేమి రైతు సంక్షేమ ప్రభుత్వమని విమర్శించారు. బిల్లులు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ఆందోళనలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో సాదం రమేష్, వడ్లురి వేంకటాద్రి, గోడిశాల వెంకటయ్య, G కుమార్, కాసాని నాగరాజు, కత్తుల రాజు, చొక్కం రాములు, పండుగ రవి, మునిగల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Views: 14
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం.. టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం.. అధికలోడే ప్రమాదానికి ప్రధాన కారణం.. మల్ వద్ద సాగర్ హైవేపై అధికలోడుతో ఒరిగిన టిప్పర్.. రంగారెడ్డి జిల్లా, యాచారం,...
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి