ప్రతి ఒక్కరిలో దేశభక్తి, జాతీయత భావం పెంపొందాలి..

On
ప్రతి ఒక్కరిలో దేశభక్తి, జాతీయత భావం పెంపొందాలి..

ప్రతి ఒక్కరిలో దేశభక్తి, జాతీయత భావం పెంపొందాలి..

IMG-20240815-WA0822
జాతీయ జెండాను ఆవిష్కరించిన ఇబ్రహీంపట్నం ఎస్.హెచ్.ఓ సత్యనారాయణ..

ఘనంగా జాతీయ పతాకాల పంపిణీ..

స్ఫూర్తి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు..

ఇబ్రహీంపట్నం, ఆగస్ట్ 15 (న్యూస్ ఇండియా ప్రతినిధి): ఇబ్రహీంపట్నం నియోజవర్గ కేంద్రంలోని ఇబ్రహీంపట్నం గ్రంథాలయం ఎదురుగా స్ఫూర్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన జాతీయ పతాకాన్ని ఇబ్రహీంపట్నం సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఆవిష్కరణ చేశారు.  ఈ సందర్భంగా స్ఫూర్తి యూత్ ఇన్చార్జి సూరమోని బాబు మాట్లాడుతూ.. తమ స్ఫూర్తి యూత్ అసోసియేషన్  గత 24 సంవత్సరాలుగా ఇబ్రహీంపట్నంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని, ప్రత్యేకంగా ప్రతి సంత్సరం స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవాలను జరపటమే కాకుండా ఈ పండగ రోజు ప్రతి ఒక్కరు జాతీయ పతాకం ధరించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి జాతీయ పతాకాల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరిలో  జాతీయత భావాలు, దేశభక్తి పెంపొందించడమే యూత్ లక్ష్యమని, దేశంలోని ప్రజలందరూ స్వాతంత్ర దినోత్సవాన్ని అమరుల త్యాగాలను స్మరించుకుంటూ పండగల  జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి యూత్ నాయకులు దానం సాయికుమార్, బుద్ధి దీపక్, వినయ్, వెంకటేష్, ఎస్ యాదగిరి, శివారెడ్డి, జె.సాయి రెడ్డి, మధుకర్, భాస్కర్ స్ఫూర్తి యూత్ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Read More డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..

Views: 26

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి
అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం, జూలై 9: అభివృద్ధి కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ నేత...
అధికారులు సర్వే చేసి భూములకు శాశ్వత హద్దులు నిర్ణయించాలి
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్ 
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయండి