ఎమ్మిగనూరు లో ఉగ్రనరసింహ రూపం లో దర్శనమిచ్చిన గణనాథుడు,

విజ్ఞాలు తొలగి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అకాక్షించిన.. ఎమ్మెల్యే బీవీ.

By Khasim
On
ఎమ్మిగనూరు లో ఉగ్రనరసింహ రూపం లో దర్శనమిచ్చిన గణనాథుడు,

న్యూస్ ఇండియా, ఎమ్మిగనూరు టౌన్, సెప్టెంబర్ 07:

వినాయక చవితి వచ్చిందంటే చాలు కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు పట్టణంలోని కొండవీటి ప్రాంత బాల వినాయక మండలి రఘువీర, ఆర్టిస్ట్ అశోక్, బండాశేఖర్, తెలుగు రాముడు, కృష్ణ, భవాని, చక్ర సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పర్యావరణ పరిరక్షణ హితం కోరుతూ కాలుష్యనివారణ లో భాగంగా వినూత్న రీతిలో గణపతులను తయారు చేస్తుంటారు. ఇందులో భాగంగా రెండు నెలలు శ్రమించి డెబ్భై కేజీలు, తొంబై వేల రుద్రాక్షల తో దాదాపు మూడు లక్షలు ఖర్చు చేసి పద్నాలుగు అడుగుల ఉగ్ర నరసింహ అవతారం లో విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్టించి ప్రజలకు దర్శనభాగ్యం కలిగించారు. స్థానిక శాసనసభ్యులు డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి కొండవీటి ప్రాంతం లోని ఉగ్ర నరసింహ అవతారం లో విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొండవీటి ప్రాంత బాల వినాయక మండలి రఘువీర, ఆర్టిస్ట్ అశోక్, బండాశేఖర్, తెలుగు రాముడు, కృష్ణ, భవాని, చక్ర సభ్యుల ఆధ్వర్యంలో పేద మహిళలకు ఎమ్మెల్యే చేతులు మీదుగా చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా శాసనసభ్యులు డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబు నాయుడు అయిన తరువాత మొట్ట మొదటి సారిగా వచ్చిన పండుగ వినాయక చవితి పండుగ అని 

ఆ విఘ్నేశ్వరుడి కరుణ కటాక్షములతో విఘ్నాలు తొలగిపోయిరాష్ట్రం, రాష్ట్రం లోని ప్రజలు సుభింక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అలాగే కొండవీటి ప్రాంత బాల వినాయక మండలి సభ్యులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ లో భాగంగా పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం నుండి వినూత్న రీతిలో విఘ్నేశ్వరులను తయారు చేస్తున్నామని, అందులో భాగంగా ఈ సంవత్సరం శివయ్య కు ఇష్టమైన రుద్రాక్షలను శ్రీశైలం, భద్రాచలం, అరుణాచలం ప్రదేశాల నుండి డెబ్భై కేజీలు అంటే తొంభై వేల రుద్రాక్షలు, దాదాపు మూడు లక్షల రూపాయలు ఖర్చు చేసి పద్నాలుగు అడుగుల ఉగ్ర నరసింహ అవతారం లో విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్టించి ప్రజలకు దర్శనభాగ్యం కలిగించామని, అందుకు మేము అభగవంతుని సేIMG-20240907-WA0353వలో తరిస్తున్నామని తెలిపారు.

Views: 102
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక