ఎమ్మిగనూరు లో ఉగ్రనరసింహ రూపం లో దర్శనమిచ్చిన గణనాథుడు,

విజ్ఞాలు తొలగి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అకాక్షించిన.. ఎమ్మెల్యే బీవీ.

By Khasim
On
ఎమ్మిగనూరు లో ఉగ్రనరసింహ రూపం లో దర్శనమిచ్చిన గణనాథుడు,

న్యూస్ ఇండియా, ఎమ్మిగనూరు టౌన్, సెప్టెంబర్ 07:

వినాయక చవితి వచ్చిందంటే చాలు కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు పట్టణంలోని కొండవీటి ప్రాంత బాల వినాయక మండలి రఘువీర, ఆర్టిస్ట్ అశోక్, బండాశేఖర్, తెలుగు రాముడు, కృష్ణ, భవాని, చక్ర సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పర్యావరణ పరిరక్షణ హితం కోరుతూ కాలుష్యనివారణ లో భాగంగా వినూత్న రీతిలో గణపతులను తయారు చేస్తుంటారు. ఇందులో భాగంగా రెండు నెలలు శ్రమించి డెబ్భై కేజీలు, తొంబై వేల రుద్రాక్షల తో దాదాపు మూడు లక్షలు ఖర్చు చేసి పద్నాలుగు అడుగుల ఉగ్ర నరసింహ అవతారం లో విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్టించి ప్రజలకు దర్శనభాగ్యం కలిగించారు. స్థానిక శాసనసభ్యులు డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి కొండవీటి ప్రాంతం లోని ఉగ్ర నరసింహ అవతారం లో విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొండవీటి ప్రాంత బాల వినాయక మండలి రఘువీర, ఆర్టిస్ట్ అశోక్, బండాశేఖర్, తెలుగు రాముడు, కృష్ణ, భవాని, చక్ర సభ్యుల ఆధ్వర్యంలో పేద మహిళలకు ఎమ్మెల్యే చేతులు మీదుగా చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా శాసనసభ్యులు డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబు నాయుడు అయిన తరువాత మొట్ట మొదటి సారిగా వచ్చిన పండుగ వినాయక చవితి పండుగ అని 

ఆ విఘ్నేశ్వరుడి కరుణ కటాక్షములతో విఘ్నాలు తొలగిపోయిరాష్ట్రం, రాష్ట్రం లోని ప్రజలు సుభింక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అలాగే కొండవీటి ప్రాంత బాల వినాయక మండలి సభ్యులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ లో భాగంగా పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం నుండి వినూత్న రీతిలో విఘ్నేశ్వరులను తయారు చేస్తున్నామని, అందులో భాగంగా ఈ సంవత్సరం శివయ్య కు ఇష్టమైన రుద్రాక్షలను శ్రీశైలం, భద్రాచలం, అరుణాచలం ప్రదేశాల నుండి డెబ్భై కేజీలు అంటే తొంభై వేల రుద్రాక్షలు, దాదాపు మూడు లక్షల రూపాయలు ఖర్చు చేసి పద్నాలుగు అడుగుల ఉగ్ర నరసింహ అవతారం లో విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్టించి ప్రజలకు దర్శనభాగ్యం కలిగించామని, అందుకు మేము అభగవంతుని సేIMG-20240907-WA0353వలో తరిస్తున్నామని తెలిపారు.

Views: 103
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

టెన్త్ విద్యార్థి ఆత్మహత్య  టెన్త్ విద్యార్థి ఆత్మహత్య 
కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 13: ఈనెల 14వ తేదీ నుంచి  10వ తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో   టెన్త్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొత్తగూడెంలో...
సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..