వరద బాధితులకు సహాయం

By Khasim
On
వరద బాధితులకు సహాయం

న్యూస్ ఇండియా యర్రగొండపాలెం సెప్టెంబర్07:

 

విజయవాడ జలప్రళయంలో అభాగ్యులుగా మారిన వారిని ఆదుకునేందుకు పట్టణానికి చెందిన ముస్లీం యూత్ సోసైటి తన దాతృత్వం చాటుకుంది.ముస్లిం యూత్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ ముస్తాక్ అహ్మద్ కు డాక్టర్ షేక్. ఇస్మాయిల్ 25వేల రూపాయల నగదు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా షేక్ ఇస్మాయిల్ మాట్లాడుతు పృకృతి సృష్టించిన జల విలయతాండవంలో ఎందరో బలైపోయారని,కనీసం త్రాగునీరు,ఆహారం అందక అగచాట్లు పడ్డారని అటువంటి వారిని ఆదుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని అన్నారు.ఈ సందర్భంగా ముస్లీం యూత్ సొసైటి అందించిన సహయార్దానికి సయ్యద్ ముస్తాక్ అహ్మద్ అభినందనలు తెలిపారు.ఈIMG-20240907-WA0397 కార్యక్రమంలోముస్లిం యూత్ సొసైటీ సభ్యులు సయ్యద్ ముక్తియార్, షేక్ చోటు, షేక్ షరీఫ్,ముస్లిం సోదరులు షేక్ సత్తార్, షేక్ సుభాని, షేక్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.

Views: 7
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి  మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి 
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా)ఫిబ్రవరి 12:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల...
ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
27 డివిజన్ నుంచి భారీ మెజార్టీతో గెలిపించండి: మద్దెల సుధారాణి 
వైద్య సేవ నుంచి ప్రజా సేవకు 11వ వార్డు బరిలో డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు
అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి
తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం
ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన