భూ సమస్యల పరిష్కారం కోసం లీపు సంస్థ కృషి అభినందనీయం.

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషను చైర్మన్               ముదిరెడ్డి కోదండ రెడ్డి

On
భూ సమస్యల పరిష్కారం కోసం లీపు సంస్థ కృషి అభినందనీయం.

                                                              

భూమి సునీల్ ఖుషి మరువలేనిది...

WhatsApp Image 2024-09-11 at 4.57.03 PM

భూ సమస్యల పరిష్కారం కోసం లిప్ సంస్థ  తయారుచేసిన బుక్కును ఆర్డీవో కు అందజేత...

యాచారం సెప్టెంబర్ 11 న్యూస్ ఇండియా ప్రతినిధి:  
యాచారం మండలంను లిప్ సంస్థ పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని భూ సమస్యలపై అధ్యయనం చేసి నివేదిక తయారు చేయడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదన్ రెడ్డి అన్నారు. బుధవారం యాచారం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో  రెవెన్యూ అధికారులు,రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండ రెడ్డి  మాట్లాడుతూ యాచారం మండలం దత్తత తీసుకొని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకొని మండలంలోని 10 గ్రామాలలో భూ సమస్యలపై పూర్తిగా అధ్యయనం చేశారని అన్నారు. భూమి సునీల్ వారి బృందానికి కోదండ రెడ్డి ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు. వారి అధ్యయనంలో గత ప్రభుత్వం తెచ్చిన ధరణితో అనేకమంది రైతులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఎంతోమందికి పట్టాదారు పాసుబుక్ పుస్తకాలు రాక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ధరణి తప్పులు తడకగా ఉందని వారి అధ్యయనంలో వెళ్ళడైందని తెలిపారు. భూమి సునీల్  పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని చేసిన ఈ అధ్యయనాన్ని ఈ నివేదికను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి త్వరలో స్వీకారం చుట్టనున్నారని తెలిపారు. రైతులందరూ ఓపిక పట్టి సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా అడుగులు వేస్తూ అధికారులకు పూర్తి సహకారాలు అందించాలని అన్నారు. అనంతరం భూమి సునీల్ మాట్లాడుతూ రైతుల సమస్యలను ప్రత్యేకమైన శ్రద్ధతో పరిష్కరించేందుకు తమ వంతుగా కృషి చేస్తామని అన్నారు. సర్వే అధ్యయనం సందర్భంగా గ్రామాల్లోని రైతులందరూ అధికారులు అందరూ సహకరించాలని అన్నారు వారందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఆర్డిఓ అనంతరెడ్డి, యాచారం తహశీల్దార్ అయ్యప్ప, రెవెన్యూ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వుప్పల భాస్కర్ గుప్తా, వెంకట్ రెడ్డి, వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు

Views: 4
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి