పౌర హక్కుల సంఘం నాయకులను వెంటనే విడుదల చేయాలి

సిఎల్సి జిల్లా అధ్యక్షుడు ఉపేందర్ రావు డిమాండ్

On

కొత్తగూడెంలో ప్లకార్డులతో నిరసన కార్యక్రమం

కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 14: పౌర హక్కుల సంఘం నాయకులను వెంటనే విడుదల చేయాలని సిఎల్సి జిల్లా అధ్యక్షుడు ఎస్ ఉపేందర్ రావు ఆధ్వర్యంలో శనివారం కొత్తగూడెం  బస్టాండ్ సెంటర్లో ప్లేకార్డు, నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమం చేపట్టారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కరకగూడెంలొ మావోయిస్టుల ఎన్కౌంటర్నికు సంబంధించి నిజనిర్ధారణకు వెళ్తున్న పౌర హక్కుల సంఘం (CLC) రాష్ట్ర నేతలను శనివారం మణుగూరు అశ్వాపురం పోలీసులు అక్రమంగా నిర్బంధించడాన్ని కొత్తగూడెం ప్రజా సంఘాల నాయకులు ఖండిస్తూ, శనివారం ప్లకార్డులు, నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ  సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎస్ ఉపేందర్ రావు మాట్లాడుతూ,.. ఎన్నడు లేని విధంగా ఈ ప్రభుత్వం జిల్లా పోలీసులు కలసి పౌర హక్కు సంఘ నేతలను నిర్బంధించడం చట్ట విరుద్ధమన్నారు. ఎన్కౌంటర్లో వారి తప్పిదాలు కప్పించుకోవడానికి పోలీసులు భయపడి సిఎల్సి నేతలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బేషరతుగా పౌర హక్కుల సంఘం నేతలను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా IMG20240914115441 డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇఫ్తు రాష్ట్ర నేతలు జడ సీతారామయ్య, గౌని నాగేశ్వరరావు, ప్రజా సంఘం నాయకులు వి.సురేష్ కుమార్, మూర్తి, ఆర్ .ఉపేందర్ రావు, అలీముద్దీన్, మారుతీ రావు తదితరులు పాల్గొన్నారు.

Views: 74
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

లగ్జరీ కారవాన్‌లో ఫ్రెండ్స్‌తో 3 రోజుల గోవా ట్రిప్.. ఎంత ఖర్చవుతుందో తెలుసా? లగ్జరీ కారవాన్‌లో ఫ్రెండ్స్‌తో 3 రోజుల గోవా ట్రిప్.. ఎంత ఖర్చవుతుందో తెలుసా?
హైదరాబాద్ నుంచి గోవాకు లగ్జరీ కారవాన్‌లో 3 రోజుల ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? కారవాన్‌లో ఉండే సౌకర్యాలు, మొత్తం ఖర్చు, 10–12 మంది వెళ్తే ఒక్కో వ్యక్తికి...
ఈ 4 ఆస్తులు మిమ్మల్ని పేదవాళ్లని చేస్తాయ్..! ధనవంతులు మాత్రం ఈ తప్పు చేయరు
సూపర్ ఎల్‌నినో వెనుక గోల్డ్ సీక్రెట్ ఏంటో తెలుసా? ప్రపంచాన్ని మార్చే ప్రకృతి లాటరీ ఇదే!
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాలు ప్రారంభం.. జొన్నగిరి గోల్డ్ మైన్ రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతుందా?
ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. కరువు, ఆహార సంక్షోభం తప్పదా?
తెలివిగా ధనవంతులు కావడం ఎలా? సంపద సృష్టించే 10 గోల్డెన్ రూల్స్ ఇవే!
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ తప్పులు చేస్తే భారీ జరిమానా.. రైల్వే రూల్స్ తెలుసా?