పౌర హక్కుల సంఘం నాయకులను వెంటనే విడుదల చేయాలి

సిఎల్సి జిల్లా అధ్యక్షుడు ఉపేందర్ రావు డిమాండ్

On

కొత్తగూడెంలో ప్లకార్డులతో నిరసన కార్యక్రమం

కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 14: పౌర హక్కుల సంఘం నాయకులను వెంటనే విడుదల చేయాలని సిఎల్సి జిల్లా అధ్యక్షుడు ఎస్ ఉపేందర్ రావు ఆధ్వర్యంలో శనివారం కొత్తగూడెం  బస్టాండ్ సెంటర్లో ప్లేకార్డు, నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమం చేపట్టారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కరకగూడెంలొ మావోయిస్టుల ఎన్కౌంటర్నికు సంబంధించి నిజనిర్ధారణకు వెళ్తున్న పౌర హక్కుల సంఘం (CLC) రాష్ట్ర నేతలను శనివారం మణుగూరు అశ్వాపురం పోలీసులు అక్రమంగా నిర్బంధించడాన్ని కొత్తగూడెం ప్రజా సంఘాల నాయకులు ఖండిస్తూ, శనివారం ప్లకార్డులు, నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ  సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎస్ ఉపేందర్ రావు మాట్లాడుతూ,.. ఎన్నడు లేని విధంగా ఈ ప్రభుత్వం జిల్లా పోలీసులు కలసి పౌర హక్కు సంఘ నేతలను నిర్బంధించడం చట్ట విరుద్ధమన్నారు. ఎన్కౌంటర్లో వారి తప్పిదాలు కప్పించుకోవడానికి పోలీసులు భయపడి సిఎల్సి నేతలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బేషరతుగా పౌర హక్కుల సంఘం నేతలను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా IMG20240914115441 డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇఫ్తు రాష్ట్ర నేతలు జడ సీతారామయ్య, గౌని నాగేశ్వరరావు, ప్రజా సంఘం నాయకులు వి.సురేష్ కుమార్, మూర్తి, ఆర్ .ఉపేందర్ రావు, అలీముద్దీన్, మారుతీ రావు తదితరులు పాల్గొన్నారు.

Views: 74
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం.. భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..   ‘భారత్ ఫ్యూచర్ సిటీ’తో తెలంగాణకు కొత్త దిశ..   ఎఫ్‌సీడీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఎఫ్‌సీడీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం...
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?
ఉద్యోగ మేళ