సెప్టెంబర్ 17నూ విద్రోహ దినంగా జరపండి

ఎం.ఎల్.పి. ఐ రెడ్ ఫ్లాగ్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జనగామ జిల్లా కార్యదర్శి

On
సెప్టెంబర్ 17నూ విద్రోహ దినంగా జరపండి

మాన్యపు భుజేoదర్

నిజాం నిరంకుశ ఆగడాలకు వ్యతిరేకంగా తెలంగాణలో గొప్ప ఉద్యమాలు జరిగాయి.1948 సెప్టెంబర్ 17 కంటే ముందే కమ్యూనిస్టుల నాయకత్వాన నిజామును రజాకార్లను మట్టికరిపించిజామీనదారులైనటువంటి విస్నూరు రామచంద్రారెడ్డి, ఎర్రబాడు ప్రతాపరెడ్డి మొదలగు దొరలు అక్రమించినట్టి సుమారుపది లక్షల ఎకరాల భూమిని కమ్యూనిస్టులు ప్రజలకు పంచినారు. మూడువేల గ్రామాల్లో రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని నిజాం రజాకార్లకు ఎదురొడ్డి పోరాడినారు. ఆ పోరాటంలో దొడ్డి కొమరయ్య, షోయబుల్లాఖాన్, షేక్ బందగి లాంటి నాలుగు వేలకు పైగా తెలంగాణ బిడ్డలను జాగీర్దార్లు, జమీందారులు బలిగొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దేశంలో ప్రపంచంలో గొప్ప చర్చాoశానీయమైంది. దీన్నే ప్రమాదకరంగా భావించి విదేశీ పెట్టుబడిదారులు దేశంలోని దళారీ వర్గాలు ఆ ఉద్యమాన్ని విధ్వంసం చేయాలని కుట్ర పన్ని యూనియన్ సైన్యాలను నెహ్రూ,పటేల్ ప్రభుత్వం దించింది. నిజాం పటేల్ సైన్యానికి లొంగిపోయినా కూడా వారు తమ సైన్యాన్ని ఎందుకు ఉపసంహరించుకోలేదు? నిజాం పారిపోయిన కూడా తెలంగాణలో వెయ్యి రోజులకు పైగా సైన్యం ఎందుకు నిజామును మించి బీభత్సవం సృష్టించింది ప్రజల స్వాధీనంలో ఉన్న భూమిని తిరిగి భూస్వాములకు ఎందుకు అప్పజెప్పింది. హిందూ ముస్లింలు కలిసే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిపినాయి. కానీ దీన్ని హిందూ ముస్లింల పోరాటంగా ఎందుకు చూపెడుతున్నారు? పాలకవర్గాలు బూర్జివ పార్టీలు విలీనం, విమోచనం, సమైక్యం, ప్రజా పాలన అంటూ చరిత్రను వక్రీకరిస్తున్నాయి తెలంగాణప్రజలు వీటికి మోసం మోసపోకుండా సెప్టెంబర్ 17న ముమ్మాటికి విద్రవదినంగా జరపాలని ప్రజలను ఎం.ఎల్. పి. ఐ రెడ్ ఫ్లాగ్ పార్టీ కోరింది.IMG-20240916-WA0274

Views: 20
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం.. భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..   ‘భారత్ ఫ్యూచర్ సిటీ’తో తెలంగాణకు కొత్త దిశ..   ఎఫ్‌సీడీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఎఫ్‌సీడీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం...
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?
ఉద్యోగ మేళ