మునిగే దెవరు?తేలేదెవరు?

On

మునుగోడు ఉప ఎన్నికలో అన్ని ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. పోలింగ్‌కు మరో పక్షం రోజులుండగానే ఎదుటి పార్టీ కంటే ఎక్కువ డబ్బులిస్తామని, తమకే ఓటేయాలని వివిధ పార్టీల నాయకులు వేలం పాటలా ఆశ చూపుతున్నారు. ఓటర్లు కూడా వీలైనంత రాబట్టుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. పలు గ్రామాల్లో ఓటుకు ఇంత ఇవ్వాలని ప్రజలే డిమాండ్‌ చేస్తున్నారు. ఒక పార్టీ ఆ డిమాండ్‌కు ఒప్పుకొంటే ప్రత్యర్థి పార్టీ అంతకంటే ఎక్కువిస్తామని ముందుకొస్తోంది. పోలింగ్‌ దగ్గర పడేకొద్దీ ప్రత్యక్ష […]

మునుగోడు ఉప ఎన్నికలో అన్ని ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. పోలింగ్‌కు మరో పక్షం రోజులుండగానే ఎదుటి పార్టీ కంటే ఎక్కువ డబ్బులిస్తామని, తమకే ఓటేయాలని వివిధ పార్టీల నాయకులు వేలం పాటలా ఆశ చూపుతున్నారు.

ఓటర్లు కూడా వీలైనంత రాబట్టుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. పలు గ్రామాల్లో ఓటుకు ఇంత ఇవ్వాలని ప్రజలే డిమాండ్‌ చేస్తున్నారు. ఒక పార్టీ ఆ డిమాండ్‌కు ఒప్పుకొంటే ప్రత్యర్థి పార్టీ అంతకంటే ఎక్కువిస్తామని ముందుకొస్తోంది.

పోలింగ్‌ దగ్గర పడేకొద్దీ ప్రత్యక్ష ప్రచారంతో పాటు సామాజిక మాధ్యమాల్లో అనుకూల, వ్యతిరేక ప్రచారాలూ ముమ్మరమయ్యాయి. ఓటుకు ఇంత అని వాగ్దానం చేస్తున్న నాయకులు ఆ గ్రామంలోని ముఖ్య నాయకులకు అడ్వాన్సుగా కొంత మొత్తం ఇచ్చి ప్రమాణం చేయిస్తున్నారు. వారి ఓట్లన్నీ గంపగుత్తగా తమ పార్టీకే వేసేలా చూడాలని కిందిస్థాయి నాయకులకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తున్నారు. డబ్బులు తీసుకున్న నాటి నుంచి తమ పార్టీకి మద్దతుగా ప్రచారం, ఇతర కార్యక్రమాలకు వారిని రప్పించాలని కూడా నిర్దేశిస్తున్నారు.

Views: 4
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక