మునిగే దెవరు?తేలేదెవరు?

On

మునుగోడు ఉప ఎన్నికలో అన్ని ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. పోలింగ్‌కు మరో పక్షం రోజులుండగానే ఎదుటి పార్టీ కంటే ఎక్కువ డబ్బులిస్తామని, తమకే ఓటేయాలని వివిధ పార్టీల నాయకులు వేలం పాటలా ఆశ చూపుతున్నారు. ఓటర్లు కూడా వీలైనంత రాబట్టుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. పలు గ్రామాల్లో ఓటుకు ఇంత ఇవ్వాలని ప్రజలే డిమాండ్‌ చేస్తున్నారు. ఒక పార్టీ ఆ డిమాండ్‌కు ఒప్పుకొంటే ప్రత్యర్థి పార్టీ అంతకంటే ఎక్కువిస్తామని ముందుకొస్తోంది. పోలింగ్‌ దగ్గర పడేకొద్దీ ప్రత్యక్ష […]

మునుగోడు ఉప ఎన్నికలో అన్ని ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. పోలింగ్‌కు మరో పక్షం రోజులుండగానే ఎదుటి పార్టీ కంటే ఎక్కువ డబ్బులిస్తామని, తమకే ఓటేయాలని వివిధ పార్టీల నాయకులు వేలం పాటలా ఆశ చూపుతున్నారు.

ఓటర్లు కూడా వీలైనంత రాబట్టుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. పలు గ్రామాల్లో ఓటుకు ఇంత ఇవ్వాలని ప్రజలే డిమాండ్‌ చేస్తున్నారు. ఒక పార్టీ ఆ డిమాండ్‌కు ఒప్పుకొంటే ప్రత్యర్థి పార్టీ అంతకంటే ఎక్కువిస్తామని ముందుకొస్తోంది.

పోలింగ్‌ దగ్గర పడేకొద్దీ ప్రత్యక్ష ప్రచారంతో పాటు సామాజిక మాధ్యమాల్లో అనుకూల, వ్యతిరేక ప్రచారాలూ ముమ్మరమయ్యాయి. ఓటుకు ఇంత అని వాగ్దానం చేస్తున్న నాయకులు ఆ గ్రామంలోని ముఖ్య నాయకులకు అడ్వాన్సుగా కొంత మొత్తం ఇచ్చి ప్రమాణం చేయిస్తున్నారు. వారి ఓట్లన్నీ గంపగుత్తగా తమ పార్టీకే వేసేలా చూడాలని కిందిస్థాయి నాయకులకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తున్నారు. డబ్బులు తీసుకున్న నాటి నుంచి తమ పార్టీకి మద్దతుగా ప్రచారం, ఇతర కార్యక్రమాలకు వారిని రప్పించాలని కూడా నిర్దేశిస్తున్నారు.

Views: 3
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యం అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి అన్నారు.శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రురు పట్టణంలోని ఎమ్మెల్యే...
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే  పట్టణ వ్యర్ధాలు
పట్నంలో మానకోడూరు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం ..