మునిగే దెవరు?తేలేదెవరు?

On

మునుగోడు ఉప ఎన్నికలో అన్ని ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. పోలింగ్‌కు మరో పక్షం రోజులుండగానే ఎదుటి పార్టీ కంటే ఎక్కువ డబ్బులిస్తామని, తమకే ఓటేయాలని వివిధ పార్టీల నాయకులు వేలం పాటలా ఆశ చూపుతున్నారు. ఓటర్లు కూడా వీలైనంత రాబట్టుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. పలు గ్రామాల్లో ఓటుకు ఇంత ఇవ్వాలని ప్రజలే డిమాండ్‌ చేస్తున్నారు. ఒక పార్టీ ఆ డిమాండ్‌కు ఒప్పుకొంటే ప్రత్యర్థి పార్టీ అంతకంటే ఎక్కువిస్తామని ముందుకొస్తోంది. పోలింగ్‌ దగ్గర పడేకొద్దీ ప్రత్యక్ష […]

మునుగోడు ఉప ఎన్నికలో అన్ని ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. పోలింగ్‌కు మరో పక్షం రోజులుండగానే ఎదుటి పార్టీ కంటే ఎక్కువ డబ్బులిస్తామని, తమకే ఓటేయాలని వివిధ పార్టీల నాయకులు వేలం పాటలా ఆశ చూపుతున్నారు.

ఓటర్లు కూడా వీలైనంత రాబట్టుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. పలు గ్రామాల్లో ఓటుకు ఇంత ఇవ్వాలని ప్రజలే డిమాండ్‌ చేస్తున్నారు. ఒక పార్టీ ఆ డిమాండ్‌కు ఒప్పుకొంటే ప్రత్యర్థి పార్టీ అంతకంటే ఎక్కువిస్తామని ముందుకొస్తోంది.

పోలింగ్‌ దగ్గర పడేకొద్దీ ప్రత్యక్ష ప్రచారంతో పాటు సామాజిక మాధ్యమాల్లో అనుకూల, వ్యతిరేక ప్రచారాలూ ముమ్మరమయ్యాయి. ఓటుకు ఇంత అని వాగ్దానం చేస్తున్న నాయకులు ఆ గ్రామంలోని ముఖ్య నాయకులకు అడ్వాన్సుగా కొంత మొత్తం ఇచ్చి ప్రమాణం చేయిస్తున్నారు. వారి ఓట్లన్నీ గంపగుత్తగా తమ పార్టీకే వేసేలా చూడాలని కిందిస్థాయి నాయకులకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తున్నారు. డబ్బులు తీసుకున్న నాటి నుంచి తమ పార్టీకి మద్దతుగా ప్రచారం, ఇతర కార్యక్రమాలకు వారిని రప్పించాలని కూడా నిర్దేశిస్తున్నారు.

Views: 3
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఆప్యాయత చిరునామా అమ్మ .. ఆప్యాయత చిరునామా అమ్మ ..
అమ్మకదిలే దైవం అమ్మ హృదయమే కోవెల అమ్మ ఆప్యాయత చిరునామా అమ్మ అనురాగం వీలునామ అమ్మరెండు అ..క్షరాల పరవశం అమ్మపెదవే పలికిన తీయని మాటే అమ్మతేనె లొలికే...
సమాజ హిత "విజయ"గర్వం...
జిల్లాలో బాలికల, విద్యార్థినిల, మహిళల కు ‘సంగారెడ్డి జిల్లా పోలీసు షీ-టీమ్స్ రక్షణ’.
నిందితులకు న్యాయస్థానం ముందు శిక్ష పడినప్పుడే, ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.
ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.