మునిగే దెవరు?తేలేదెవరు?

On

మునుగోడు ఉప ఎన్నికలో అన్ని ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. పోలింగ్‌కు మరో పక్షం రోజులుండగానే ఎదుటి పార్టీ కంటే ఎక్కువ డబ్బులిస్తామని, తమకే ఓటేయాలని వివిధ పార్టీల నాయకులు వేలం పాటలా ఆశ చూపుతున్నారు. ఓటర్లు కూడా వీలైనంత రాబట్టుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. పలు గ్రామాల్లో ఓటుకు ఇంత ఇవ్వాలని ప్రజలే డిమాండ్‌ చేస్తున్నారు. ఒక పార్టీ ఆ డిమాండ్‌కు ఒప్పుకొంటే ప్రత్యర్థి పార్టీ అంతకంటే ఎక్కువిస్తామని ముందుకొస్తోంది. పోలింగ్‌ దగ్గర పడేకొద్దీ ప్రత్యక్ష […]

మునుగోడు ఉప ఎన్నికలో అన్ని ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. పోలింగ్‌కు మరో పక్షం రోజులుండగానే ఎదుటి పార్టీ కంటే ఎక్కువ డబ్బులిస్తామని, తమకే ఓటేయాలని వివిధ పార్టీల నాయకులు వేలం పాటలా ఆశ చూపుతున్నారు.

ఓటర్లు కూడా వీలైనంత రాబట్టుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. పలు గ్రామాల్లో ఓటుకు ఇంత ఇవ్వాలని ప్రజలే డిమాండ్‌ చేస్తున్నారు. ఒక పార్టీ ఆ డిమాండ్‌కు ఒప్పుకొంటే ప్రత్యర్థి పార్టీ అంతకంటే ఎక్కువిస్తామని ముందుకొస్తోంది.

పోలింగ్‌ దగ్గర పడేకొద్దీ ప్రత్యక్ష ప్రచారంతో పాటు సామాజిక మాధ్యమాల్లో అనుకూల, వ్యతిరేక ప్రచారాలూ ముమ్మరమయ్యాయి. ఓటుకు ఇంత అని వాగ్దానం చేస్తున్న నాయకులు ఆ గ్రామంలోని ముఖ్య నాయకులకు అడ్వాన్సుగా కొంత మొత్తం ఇచ్చి ప్రమాణం చేయిస్తున్నారు. వారి ఓట్లన్నీ గంపగుత్తగా తమ పార్టీకే వేసేలా చూడాలని కిందిస్థాయి నాయకులకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తున్నారు. డబ్బులు తీసుకున్న నాటి నుంచి తమ పార్టీకి మద్దతుగా ప్రచారం, ఇతర కార్యక్రమాలకు వారిని రప్పించాలని కూడా నిర్దేశిస్తున్నారు.

Views: 3
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..