ఈడి దాడులకు భయపడేది లేదు

టీపిసిసి సభ్యులు నాగ సీతారాములు

On

కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్)  సెప్టెంబర్ 28: ప్రజలకు సుపరిపాలనIMG-20240927-WA1546 అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలపై కుట్ర చేస్తున్నారని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు అన్నారు. బీజేపీలో అభద్రతాభావం పెరిగిందనడానికి నేడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై జరుగుతున్న ఈడి దాడులే నిదర్శనమన్నారు. దేశంలో బీజేపీ పై వ్యతిరేకత వ్యక్తం అవుతున్న వేళ కాంగ్రెస్ నేత‌లను భయాందోళనకు గురి చేసేందుకే ఐటి, ఈడీ, పోలీసుల దాడులను బిజెపి నేత‌లు చేయిస్తున్నార‌ని ఆయన ఆరోపించారు. పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆత్మీయ బంధువు మంత్రి పొంగులేటి శ్రీనన్న పై ఎన్ని సార్లు దాడులు చేసిన ఆయన్ని, ఆయన అనుచరగణాన్ని, ఆయన వెనకున్న ప్రజాసైన్యాన్ని భయపెట్టలేరని ఆయన అన్నారు. కాళేశ్వరం సహా, అనేక అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న కేసీఆర్ అండ్ కో లపై మోడీ ఈడి ని పంపగలరా అని సవాల్ విసిరారు.

Views: 31
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఖమ్మం డిసెంబర్ 6 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాధపాలెం మండలం మంగ్య తండా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ ఏకగ్రీవమైనది.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోతు భార్గవి...
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్