అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి అండగా 14500/- ఆర్థిక సహాయంతో చేయూత...!

- వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, మాజీ ఎంపీపీ రఘురాముడు, దొడ్డిమేకల సర్పంచ్ చంద్రశేఖర్ లు బాధిత కుటుంబానికి భరోసా...

On
అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి అండగా 14500/- ఆర్థిక సహాయంతో చేయూత...!

న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 29 :- మండలకేంద్రమైన పెద్దకడుబూరులోని స్థానిక ఎస్సి కాలనిలో ఇటీవల షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగి సర్వం కోల్పోయిన మంచోది శాంతిరాజు కుటుంబానికి అండగా నిలుస్తూ శనివారం వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు 10వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసారు. అలాగే మాజీ ఎంపీపీ రఘురాముడు 2500/- మరియు దొడ్డిమేకల సర్పంచ్ చంద్రశేఖర్ 2వేల రూపాయలు చొప్పున ఆ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ కుటుంబ సభ్యులెవ్వరు అధర్యపడొద్దని, అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అగ్ని ప్రమాదంలో జరిగిన ఆస్థి నస్టానికి ప్రభుత్వం నష్ట పరిహారం సత్వరమే బాధిత కుటుంబానికి అందేలా ఎమ్మెల్యే వై.బాలనాగి రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్లి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపి నేతలు మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, మాజీ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, రవిచంద్రా రెడ్డి, విజేంద్ర రెడ్డి, శివరామి రెడ్డి మరియు వైసీపీ నాయకులు ముక్కరన్న, అర్లప్ప, జాము మూకయ్య, సుందరం, ప్రసాద్, ఏసన్న, లోకేష్, ఆంజినయ్య మరియు వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.IMG_20240928_131829

Views: 67
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి
అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం, జూలై 9: అభివృద్ధి కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ నేత...
అధికారులు సర్వే చేసి భూములకు శాశ్వత హద్దులు నిర్ణయించాలి
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్ 
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయండి