నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో విజిలెన్స్ అవగాహన

On
నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో విజిలెన్స్ అవగాహన

అవినీతి రహిత భారతదేశం అందరి లక్ష్యంమని దానికోసం అందరూ కృషి చేయాలని ఖమ్మం నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జిల్లా యువ అధికారి భూక్య ప్రవీణ్ సింగ్ గారి ఆదేశాల మేరకు అకౌంట్స్ అండ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కమర్తపు భానుచందర్ గారి సహకారంతో పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సయ్యద్ షారుక్ ఇమ్రాన్, ఖమ్మం మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విజిలెన్స్ అవగాహన కార్యక్రమమును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అవినీతి నిర్మూలనపై వ్యాసరచనలు పోటీలు నిర్వహించి అనంతరం ప్రతిజ్ఞ మరియు ర్యాలీ తీసుకోవడం జరిగింది. గాంధీ చౌక్ లోని కొన్ని షాపుల దగ్గరికి వెళ్లి విజిలెన్స్ - అవినీతి నిర్మూలనపై అవగాహన కల్పించి ఐ ఈ సి మెటీరియల్ పంచడం జరిగింది. ఇందుకు సహకరించినందుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల యాజమాన్యానికి నెహ్రు యువ కేంద్ర తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.

Views: 7
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News