బి ఎస్ రావు ఆధ్వర్యంలో మెగా క్రికెట్ పోటీలు ప్రారంభం

మొదటి మ్యాచ్ లో పోలీస్ జట్టు విజయం

On
బి ఎస్ రావు ఆధ్వర్యంలో మెగా క్రికెట్ పోటీలు ప్రారంభం

రెండో మ్యాచ్ లో సింగరేణి జట్టు విజయం

కొత్తగూడెం(న్యూస్ ఇండియా నరేష్) నవంబర్8: డాక్టర్ బి ఎస్ రావు ఆధ్వర్యంలో మెగా విఐపి క్రికెట్ పోటీలు ఉమ్మడి ఖమ్మం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చేకూరి వెంకట్, ఉమ్మడి ఖమ్మం జిల్లా కోచ్ సన్నీ సోబర్స్ సహాయ సహకారాలతో కొత్తగూడెం ప్రకాశం మైదానంలో శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ 8,9,10,11 తేదీల వరకు నిర్వహించినట్లుగా నిర్వాహకులు తెలిపారు. మొదటిరోజు ప్రారంభమైన మ్యాచ్IMG-20241108-WA1452 లో పోలీస్ మరియు డాక్టర్ జట్లు తలపడగా, పోలీస్ జట్టు సునాయాసగా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పోలీస్ జట్టు 20 ఓవర్లు ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 224 /7పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన డాక్టర్స్ జట్టు 162 /4 పరుగులు చేసి ఓటమిపాలైంది. పోలీస్ జట్టులో రమణారెడ్డి(59), గోపాల్ ( 50) నాగరాజు (31) అత్యధిక పరుగులను అందించారు.

రెండో మ్యాచ్ వివరాలు...

సింగరేణి జట్టు మరియు పంచాయతీరాజ్ జట్లు తలపడగా సింగరేణి జట్టు 20 ఓవర్లు ముగిసే సమయానికి 229/4 పరుగులు సాధించింది, పంచాయతీరాజ్ జట్టుకు230 పరుగుల విజయ లక్ష్యాన్ని వారి ముందు ఉంచగా,19.3 ఓవర్లు ముగిసే సమయానికి 108 /10పరుగులతో ఓటమి పాలైంది. సింగరేణి జట్టులో సాయి రాకేష్ (105) పరుగులు, నాగమోహన్ (65) పరుగులు చేసి అత్యధిక పరుగులను అందించారు.

Views: 111
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన  మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా బ్యూరో) మార్చి 11  :అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయవాది పరిషత్ తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో బుధవారం మహిళా న్యాయవాదుల...
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..
తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ