పోలీస్ స్టేషన్ లో కేసులు అంటే ఆషా మాషి కాదు... అనవసరంగా ఎవ్వరు గొడవపడొద్దు...!

ప్రజలకు అవగాహనా కల్పించిన ఎమ్మిగనూరు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ ఎం ఉపేంద్ర బాబు...

On
పోలీస్ స్టేషన్ లో కేసులు అంటే ఆషా మాషి కాదు... అనవసరంగా ఎవ్వరు గొడవపడొద్దు...!

- కార్యక్రమంలో కోసిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ బి ఏ మంజునాథ్ పెద్దకడుబూరు ఎస్సై నిరంజన్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

న్యూస్ ఇండియా/ పెద్దకడుబూరు మండలం నవంబర్ 11 :- కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడుబూరు మండల పరిధిలోని పెద్దకడుబూరు మరియు కల్లుకుంట గ్రామాలను ఎమ్మిగనూరు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ ఎం ఉపేంద్ర బాబు సోమవారం సందర్శించారు. గ్రామ ప్రజలతో ఆయన సమావేశం ఏర్పరిచి ప్రజలు గొడవలు కొట్లాటలకు దూరంగా ఉండాలని కేసులు నమోదు కావడం వల్ల ఏ విధంగా నష్టపోతారో పూర్తిగా వివరంగా తెలియజేశారు. గొడవపడే ముందు కొద్దిసేపు ఆలోచన చేస్తే దాదాపు చాలా వరకు నేరాలు తగ్గుతాయని చెప్పారు. దానితో పాటు వాహనాలు నడిపినప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుని రోడ్డు ప్రమాదాలు నివారించాలని అలాగే ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయి అవగాహన లేకుండా చాలామంది మోసపోతున్నారు కాబట్టి ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీలు అడగడం, పార్ట్ టైం జాబు చేయమనడం వంటి వాటికి రెస్పాన్స్ ఇవ్వరాదని , మోసపోయిన వారు వెంటనే 1930 నెంబర్ కు ఫోన్ చేసి వారి యొక్క ఫిర్యాదు నమోదు చేయవలసిందిగా తెలియజేశారు. డిఎస్పి గారితో పాటు కోసిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ బి ఏ మంజునాథ్ పెద్దకడూరు ఎస్సై నిరంజన్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.IMG-20241111-WA0171

Views: 79
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం.. భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..   ‘భారత్ ఫ్యూచర్ సిటీ’తో తెలంగాణకు కొత్త దిశ..   ఎఫ్‌సీడీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఎఫ్‌సీడీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం...
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?
ఉద్యోగ మేళ