బైక్ దొంగ అరెస్ట్

8 బైకులు స్వాధీనం చేసుకున్న వన్ టౌన్ పోలీసులు

On
బైక్ దొంగ అరెస్ట్

వివరాలు వెల్లడించిన సిఐ కరుణాకర్

కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్)డిసెంబర్‌4: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బైకుల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని వన్‌ టౌన్‌  పోలీసులు అరెస్టు చేసినట్లు సిఐ ఎం.కరుణాకర్‌ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు సిఐ వెల్లడిస్తూ..IMG-20241204-WA1420 ఈజీ మనికి అలవాటు పడిన భద్రాచలం పట్టణానికి చెందిన గుమ్మడి రాజు గత కొంతకాలంగా ద్విచక్ర వాహనాలను దొంగిలించి వాటిని విక్రయిస్తూ వచ్చిన డబ్బుతో జల్సా జీవితాన్ని గడుపుతున్నాడు. మంగళవారం రాత్రి కోతగూడెం బస్టాండ్‌ సెంటర్‌లో పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా రాజు ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించింది.అతన్ని పోలీసులు ప్రశ్నించగా పొందలేని సమాధానం చెప్పడంతో అతని అదుపులోకి తీసుకొని విచారించారు. ఇటీవల కాలంలో ఖమ్మంలో 6, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు అంగీకరించాడు. రాజును పోలీసులు అరెస్టు చేసి ఎనిమిది వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ స్పష్టం చేశారు. దొంగను అదుపులోకి తీసుకోవడంలో కృషిచేసిన సిఐ కరుణాకర్‌, కానిస్టేబుల్‌, శంకర్‌ ,సురేష్‌ నరేష్‌లను డిఎస్పి అబ్దుల్‌ రెహమాన్ ప్రత్యేకంగా అభినందించారు.

Views: 177
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది: ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు
కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..