ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు కరువాయే ...

కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే సాంబశివరావు 

On
ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు కరువాయే ...

వైద్యుల కొరతతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

కొత్తగూడెం (న్యూస్ఇండియా నరేష్) డిసెంబర్ 5: కొత్తగూడెం సర్వేజనా ఆస్పత్రిని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆస్పత్రిలోని వైద్యులు 34 మందికి గాను,12 మంది వీధుల్లో ఉండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు . ఎక్స్రే , సిటీ స్కాన్ ,రేడియాలజిస్ట్ విభాగాల్లో పదిమంది టెక్నీషియన్స్ కు గాను ఇద్దరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వెటిలెటారులు 25కి గాని నాలుగు మాత్రమే పనిచేస్తున్నాయని తెలిపారు. ఇలా వైద్యుల కొరత, సమయపాలన లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్పిటల్ ను సాధ్యమైనంత తొందరగా ప్రక్షాళన చేసే అవసరం ఉందన్నారు. వారంలో ఏదో ఒక రోజు ఆకస్మికంగా తనిఖీకి వస్తానని  వైద్యులను హెచ్చరించారు. ఆస్పత్రి సమస్యలపై కలెక్టర్, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షాబిర్ పాషా, చంద్రగిరి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Views: 123
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి  సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
పాల్వంచ (న్యూస్ ఇండియ) డిసెంబర్ 13:ఈ నెల 14 వ తేదీన జరగనున్న పంచాయితీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న సర్పంచ్,వార్డు సభ్యులను...
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు
మూలగూడెం గ్రామ సర్పంచిగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జర్పుల రవీందర్ విజయం
పంగిడి గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా స్వాతి
ఒక్క ఓటుతో గెలిచిన బిఆర్ఎస్ అభ్యర్థి నునావత్ పెంట్యా
కొమ్మనేపల్లి గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధర్మసోత్ కిషన్
కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జాటోత్ జాయ్ లూసీ