ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు కరువాయే ...

కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే సాంబశివరావు 

On
ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు కరువాయే ...

వైద్యుల కొరతతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

కొత్తగూడెం (న్యూస్ఇండియా నరేష్) డిసెంబర్ 5: కొత్తగూడెం సర్వేజనా ఆస్పత్రిని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆస్పత్రిలోని వైద్యులు 34 మందికి గాను,12 మంది వీధుల్లో ఉండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు . ఎక్స్రే , సిటీ స్కాన్ ,రేడియాలజిస్ట్ విభాగాల్లో పదిమంది టెక్నీషియన్స్ కు గాను ఇద్దరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వెటిలెటారులు 25కి గాని నాలుగు మాత్రమే పనిచేస్తున్నాయని తెలిపారు. ఇలా వైద్యుల కొరత, సమయపాలన లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్పిటల్ ను సాధ్యమైనంత తొందరగా ప్రక్షాళన చేసే అవసరం ఉందన్నారు. వారంలో ఏదో ఒక రోజు ఆకస్మికంగా తనిఖీకి వస్తానని  వైద్యులను హెచ్చరించారు. ఆస్పత్రి సమస్యలపై కలెక్టర్, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షాబిర్ పాషా, చంద్రగిరి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Views: 124
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి
కాంగ్రెస్ లో మంత్రుల మధ్య సమన్వయం లేదు
తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం
ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన
ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక
55వ డివిజన్‌లో జనసేన జోరైన ప్రచారం
తొర్రూర్ మున్సిపాలిటీ 06వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.
#Draft: Add Your Titleతొర్రూర్ మున్సిపాలిటీ 06వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.