ఏసిబి వలో ఓ పోలీస్ అధికారి.........?

• పిడిఎస్ రైస్ వ్యాపారిని డబ్బు డిమాండ్ • కొంత డబ్బు తీసుకున్నారనే ఆరోపణలు • సోదాలు జరుపుతున్న ఏసీబీ అధికారులు • తొర్రూరులో కొనసాగుతున్న విచారణ

ఏసిబి వలో ఓ పోలీస్ అధికారి.........?

IMG-20250106-WA0008

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఓ పోలీస్ అధికారిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. గత సంవత్సరం దంతాలపల్లి వద్ద అధికారులు రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా జరుగుతుండగా పట్టుకున్నారు. ఈ కేసులో ఆదిలాబాద్ కు చెందిన ఓ నిందితుడి నుంచి పోలీసు అధికారి రూ.4లక్షలు డిమాండ్ చేసి రూ. 2 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మిగతా డబ్బు కోసం తనకు కాల్ చేస్తుండటంతో నిందితుడు ఏసీబీ అధికారులను సంప్రదించినట్లు తెలుస్తుంది. తొర్రూర్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.

పీడీఎస్ రైస్ బిజినెస్ చేసే ఓ వ్యాపారిని రూ.ఐదు లక్షలు డిమాండ్ చేసి రూ.రెండు లక్షలు తీసుకున్నారనే ఆరోపణలపై సదరు ప దీనిపై ఏసీబీ అధికారులు వివరాలను వెల్లడించాల్సి ఉంది. ఒక పోలీస్ అధికారిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకోవడం సంచలనం కలిగించింది.

Views: 4
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

అయోమయంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు అయోమయంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) కొత్తగూడెంలో నిన్న జరిగిన కార్పొరేటర్ల ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం స్థానిక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. పొత్తు ఒప్పందంలో భాగంగా మేయర్...
కలిసి కట్టుగా ముందుకు సాగుతాం :కూనంనేని 
సింగరేణి డాకర్ల నిర్లక్ష్యం ఖరీదు... యువకుడు నవీన్ ప్రాణం బలి..
విద్యార్థి భవిష్యత్తుతో ఆడుకుంటున్న అలేన్ ఇన్స్టిట్యూషన్...!
పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ కు అధిక ఓట్లు
కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి