జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన హెడ్ కానిస్టేబుల్ వీరభద్రం

మూడు మెడల్స్ సాధించి జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక

On
జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన హెడ్ కానిస్టేబుల్ వీరభద్రం

కొత్తగూడెం(న్యూస్ ఇండియా నరేష్)జనవరి 6 : కొత్తగూడెం చెందిన  హెడ్ కానిస్టేబుల్  పి. వీరభద్రం 11వ తెలంగాణ స్టేట్ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 2025 పోటీల్లో మూడు మెడల్స్ సాధించి జాతీయ స్థాయిలో జరిగే పోటీకి ఎంపికయ్యారు.  హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో  ఆదివారం జరిగిన ఈ పోటీల్లో  1500 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్, 5 కిలోమీటర్లు,  400 మీటర్ల పరుగు పందెంలో  వెండి  పథకాలు  సాధించారు.  ఓపెన్ క్యాటగిరీలో  50 ప్లస్ ఏజ్ గ్రూప్ కు నిర్వహించిన ఈ పోటీలో రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారులు పాల్గొనగా వీరభద్రం అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అరుదైన ఘనత సాధించారు. భద్రాద్రి  కోతగూడెం జిల్లా పోలీస్ శాఖలో ఆర్ ఐ  సుధాకర్  ఆధ్వర్యంలో ఎంటి వింగ్  విభాగంలో  హెడ్ కానిస్టేబుల్  వీరభద్రం  విధులు నిర్వహిస్తున్నారు. సిఐ చెన్నూరి శ్రీనివాస్ సహాయ సహకారం, ప్రోద్భలంతో వీరభద్రం రాష్ట్ర స్థాయిలో రాణించి ఈ నెల 31 నుండి ఫిబ్రవరి3 వరకు కేరళలోని తిరుతిలో జరిగే జాతీయ స్థాయి పోటీలో పాల్గొనేందుకు అర్హత సాధించారు.

Views: 31
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

కొత్తగూడెం కార్పొరేషన్ అభ్యర్థుల స్కృట్నీ కొత్తగూడెం కార్పొరేషన్ అభ్యర్థుల స్కృట్నీ
కొత్తగూడెం(న్యూస్ ఇండియా)జనవరి 31: కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్లకు సంబంధించి శుక్రవారం వరకు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలకు స్కృట్నీ శనివారం కొత్తగూడెం కార్పొరేషన్ కార్యాలయంలో ఎన్నికల...
నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం పరిధిలో ఐటిపాముల గ్రామంలో రైస్ 360 కన్సల్టేషన్ మీటింగ్
24 డివిజన్ నుంచి బీర రవి నామినేషన్ 
కార్పొరేషన్ నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఎస్పీ 
TRTF క్యాలెండర్ డైరీ ఆవిష్కరించిన డిఇఓ 
స్థానిక యుద్దానికి మేం సిద్ధం 
ఫిబ్రవరి 11న తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు