కొత్తగూడెం ఆర్టీసీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
ముఖ్యఅతిథిగా ఎంవిఐ మనోహర్
On
కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్ )జనవరి 8 :జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు సందర్భంగా బుధవారం కొత్తగూడెం డిపో మేనేజర్ ఎం.దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో కొత్తగూడెం బస్టాండ్ వద్ద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎంవిఐ మనోహర్ విచ్చేసి ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఆర్టీసీ సిబ్బంది, కాలేజీ విద్యార్థులు, హమాలీలు, ఇతరులు స్వచ్ఛందంగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం వల్లన రోడ్డు ప్రమాదాల బారిన పడ్డప్పుడు బాధితులకు రక్తం అందుబాటు లేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని. రక్తం దానం చేయడం వల్ల బాధితుల ప్రాణాలు కాపాడినవారు అవుతాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూబిఐ బ్యాంక్ మేనేజర్ దేవరాజ్, ఆర్టీసీ సిబ్బంది సురేష్, జాకబ్, హనుమ, రాములు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Views: 79
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
01 Feb 2026 12:16:01
భారీ ఎత్తున బిఆర్ఎస్ బైక్ ర్యాలీ, అడ్డుకున్న పోలీసులు

Comment List