మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన - నెహ్రూ యువ కేంద్ర

On
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన - నెహ్రూ యువ కేంద్ర

ఖమ్మం జిల్లా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో, కేసీఆర్ నగర్ యూత్ క్లబ్ వారు అమరవీరుల రోజు ( మహాత్మా గాంధీ గారి వర్ధంతి) ఖమ్మం ప్రభుత్వ మహిళ డిగ్రీ కాలేజ్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ అసోసియేషన్ నాయకులు మురళీకృష్ణ, సయ్యద్ షారుక్ ఇమ్రాన్, ప్రిన్సిపల్ డా.జి.పద్మావతి, ఎన్ ఎస్ ఎస్ పీఓలు రామకుమార స్వామి, శ్యామలదేవి గాంధీ గారి చిత్రపటానికి ముందుగా పూలమాల వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత యువతకు మహాత్మా గాంధీ గారి జీవితాన్ని గురించి వివరించి ఆయన లాగా గొప్ప స్థాయికి యువత కూడా వెళ్లాలని ప్రోత్సహిస్తూ వారితో వ్యాసరచనలు, ఉపన్యాస పోటీలు నిర్వహించి వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది. మరియు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి అందులో భాగంగా కారో య మరో, జహా ప్రేమ్ హై - వహీ జీవన్ హై, సత్ ఎక్ హై - మార్గ్ హై కహి, మేరా జీవాన్ హై - మేరా సందేశ్ హై, మొదలగు నినాదాలతో అక్కడి ప్రజలకు అవగాహన ఇస్తూ ర్యాలీతో గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని అక్కడి పరిసరాలను శుభ్రం చేసి పూలమాల వేయడం జరిగింది.

Views: 4
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం
మహబూబాబాద్ జిల్లా:- మీడియా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ... ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని తొర్రూరు జర్నలిస్టు సంఘాల నేతలు  విమర్శించారు.  మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ...
జాతీయ యువజన దినోత్సవం
డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!
వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..
వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా
అనారోగ్య మరణించిన పీరమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం
ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం