శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల వింశ:(20వ) వార్షిక బ్రహ్మోత్సవం

On
శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల వింశ:(20వ) వార్షిక బ్రహ్మోత్సవం

శేరిలింగంపల్లి ( ఫిబ్రవరి 02) : న్యూస్ ఇండియా ప్రతినిధి కే.వినోద్ కుమార్ హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్డు లోని సెవెన్ హిల్స్ కాలనీ లో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల వింశ:(20వ) వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంగా దాతల సౌజన్యంతో శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి రజత(వెండి) కవచం ను దాతల సమక్షంలో కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు , దేవాలయం ఈ ఓ సత్యనారాయణ మరియు భక్తులతో కలిసి స్వామి వారి బహుకరించి ప్రత్యేక పూజలు చేసిన పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా పిఎసి చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి దాతల సహకారంతో రజత కవచం ను అందచేయడం చాలా సంతోషకరమైన విషయం అని , రజత కవచం ను అందచేసిన దాతలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినదిస్తున్నాను అని పిఎసి చైర్మన్ గాంధీ తెలియచేశారు. వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలతో ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండలని, స్వామి వారి కృపా ప్రజలందరి పై ఉంటుంది అని పిఎసి చైర్మన్ గాంధీ తెలియచేశారు. ఈ కార్యక్రమంలో రజత ( వెండి) కవచం అందచేసిన దాతలు: 1 ప్రసాద్ - పద్మిని, 2.బాలు- మంజుల, 3.సాంబశివరావు- ఉషారాణి, 4.ఉమ శంకర్ - సుజాత మరియు నాయకులు కె ఆర్ కె రాజు, రాగ ప్రసాద్, పోతుల రాజేందర్, శ్రీ హరి, పద్మ ,సాంబ శివ రెడ్డి,అప్పిరెడ్డి, కిరణ్ కుమార్, కడియాల శివ ,సుజాత, నిఖిల్ మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Views: 0
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

మర్రి"తో "మాచన" అనుభందం... మర్రి"తో "మాచన" అనుభందం...
"మర్రి"తో "మాచన" అనుభందం  "మర్రి చెన్నారెడ్డి" లో శిక్షణ అనుభవం.. రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 15, (న్యూస్ ఇండియా ప్రతినిధి): పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్...
ధాన్యం సేకరణ ఓ క్రతువు..
దాహార్తిని తీర్చండి
మినీ మేడారం జాతరకు  ప్రత్యేక బస్సు
డొమెస్టిక్ సిలిండర్లు హోటళ్ళ లో ఎలా ఉన్నాయ్..
ఘనంగా 49వ సింగరేణి హై స్కూల్ వార్షికోత్సవం 
రేషన్ అక్రమార్కులపై పి డి యాక్ట్ ఖాయం..