ఘనంగా ప్రారంభమైన పోలీస్ అన్యువల్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్ 

ప్రారంభించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు 

On

భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియాబ్యూరోనరేష్) ఫిబ్రవరి 6: జిల్లా పోలీసుల అన్యువల్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్ 2025 ను హేమచంద్రపురం  హెడ్ క్వార్టర్స్ నందు గురువారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పతక ఆవిష్కరణ చేసి ఘనంగా ప్రారంభించారు. జిల్లాలోని సబ్ డివిజన్ కు చెందిన డార్ హెడ్ క్వార్టర్స్, కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, భద్రాచలం, మణుగూరు, డిపిఓ అండ్ స్పెషల్ వింగ్స్, హోంగార్డ్స్ వింగ్స్, విభాగాల కు చెందిన స్పోర్ట్స్ జట్లు నుండి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు గౌరవ వందనం స్వీకరించారు. శాంతి పావురాలను ఎగురవేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సిబ్బందితో స్పోర్ట్స్ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..ఈ స్పోర్ట్స్ మీట్ మూడు రోజుల పాటు 6,7, 8 తేదీ లా పాటు నిర్వహించినట్లు తెలిపారు. స్నేహపూర్వ వాతావరణం లో ఆటలు కొనసాగించాలని కోరారు. గెలుపు ఓటములు సహజమని అన్నారు. ఈ గేమ్స్ వల్ల పనిలో ఒత్తిడిని తగ్గించుకోవచ్చన్నారు. మానసికంగా, ఆరోగ్యంగా మన ఫిట్నెస్ ని పొందవచ్చు అన్నారు. పాల్వంచ మరియు హోంగార్డ్స్ వాలీబాల్ పోటీని ఎస్పీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పి  విక్రత్ కుమార్ సింగ్ , డిఎస్పి అబ్దుల్ రెహమాన్, చంద్రబాను, సతీష్, రవీందర్ రెడ్డి, సిఐలు ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు

Views: 17
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా? కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బీజేపీ నాయకుడు పిల్లి శ్రీనివాస్ యాదవ్ ముందస్తు అరెస్టు – ప్రభుత్వ తీరుపై తీవ్ర...
ఉద్యోగ మేళ
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్!
పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు