జాతర బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన
జనగామ డిసిపి
By Venkat
On
రాజమహేంద్ర నాయక్
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం లో మహాశివరాత్రి సందర్భంగా జాతర ఏర్పాట్లను పరిశీలించిన జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ జాతరకు నలుగురు సీఐలు, 24 మంది ఎస్ఐలు, 25 మంది హెడ్ కానిస్టేబుల్, 85 కానిస్టేబుల్ లతో జాతర బందోబస్తు నిర్వహిస్తున్నామని జాతర బందోబస్తును కంట్రోల్ రూమ్ నుండి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంటామని జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈ సందర్భంగా తెలిపారు.డీసీపీ వెంట ఏసిపి నర్సయ్య, సిఐ మహేందర్ రెడ్డి, ఎస్ఐ పవన్ కుమార్,ఎస్ఐ లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు
Views: 18
Tags:

Comment List