ఈశ్వరా..సి పి ఎస్ రద్దు చేయ.."రా'.!
ఎన్ ఓ పీ ఆర్ యూ ఎఫ్ తెలంగాణ అధ్యక్షులు మాచన రఘునందన్
ఈశ్వరా..సి పి ఎస్ రద్దు చేయ.."రా'.!
ఎన్ ఓ పీ ఆర్ యూ ఎఫ్
తెలంగాణ అధ్యక్షులు మాచన రఘునందన్

భాగస్వామ్య పింఛను పథకం రద్దు కోసం రాజన్న కు ప్రత్యేక పూజలు..
పరమేశ్వరా..పాత పెన్షన్ పథకం ను పునరుద్ధరించ.. రా..రా..! అంటూ శివయ్య ను వేడుకున్నానని,న్యూ పెన్షన్ స్కీమ్(సి పి ఎస్)రద్దు కోసం దైవాన్ని వేడుకోక తప్పటం లేదని నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టోరేషన్ యునైటెడ్ ఫ్రంట్ (ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్)తెలంగాణ అధ్యక్షులు మాచన రఘునందన్ అభిప్రాయ పడ్డారు.భుధవారం నాడు ఆయన సి పి ఎస్ రద్దు కావాలన్న.. తమ అభిమతం నెరవేరాలని కోరుతూ..కీసర గుట్ట ఆలయం లో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..మార్చి లో ఢిల్లీ లో ఎన్.ఓ.పీ.ఆర్.యు.ఎఫ్ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగనుందని చెప్పారు.పాలకులు ఎప్పటికప్పుడు ఎన్నికల సందర్భంగా సి పి ఎస్ రద్దు చేస్తాం అని హామీ ఇచ్చి పబ్బం గడుపుకుంటున్నారే తప్ప..పెన్షన్ తో నే ఉద్యోగుల ఆర్ధిక భద్రత ఆన్న విషయం వారికి పట్టడంలేదని రఘునందన్ అవేదన వ్యక్తం చేశారు.దేశ వ్యాప్తంగా కోటి మంది కి పైగా ఉద్యోగులు "న్యూ పెన్షన్ స్కీమ్ వద్దు మహా ప్రభో అని దీనంగా దైవాన్ని అర్ధిస్తున్నామని రఘునందన్ వివరించారు. ఏలికలకు,రాష్ట్రం లో ని పాలకులకు సి.పి.ఎస్ రద్దు చేసే బుద్ధి ప్రసాదించాలని కోరుతూ..దేవుళ్ళకు పూజలు చేసినట్టు రఘునందన్ వెల్లడించారు. రఘునందన్ వెంట జి బాబా వినోద్ కుమార్ అన్నారు.
Comment List