గ్యాస్ సరఫరా లో "చిల్లర" లెక్కలు మానాలి...
పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డి.టి మాచన రఘునందన్...
On
గ్యాస్ సరఫరా లో "చిల్లర" లెక్కలు మానాలి...
పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డి.టి మాచన రఘునందన్...
నల్గొండ జిల్లా, ఫిబ్రవరి 28, (న్యూస్ ఇండియా ప్రతినిధి):- గ్యాస్ డీలర్లు ఇష్టా రాజ్యంగా అధిక మొత్తం వసూలు చేస్తే, వారిపై చర్య తీసుకోవడానికి ఒకే ఒక్క ఫిర్యాదు చాలు అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన సాగర్ రోడ్డు లో మాట్లాడుతూ.. ఏజన్సీలు, డెలివరి బాయ్స్ ఇష్టారాజ్యానికి వదిలేస్తుండటంతో.. వారు "చిల్లర" లెక్కల కు పాల్పడుతూ..వినియోగదారులను విసిగిస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయన్నారు. వినియోదారులు గనక గిడ్డంగి కి వచ్చి బండ తీసుకుంటే రిబేటు అడిగే హక్కు కూడా వారికి ఉన్నదని రఘునందన్ గుర్తు చేశారు. ఇకనైనా గ్యాస్ డీలర్లు అధిక వసూళ్లకు చెక్ పెట్టాలని మాచన రఘునందన్ సూచించారు.
Views: 10
About The Author
Related Posts
Post Comment
Latest News
07 Dec 2025 17:49:51
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్)
రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...

Comment List