క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 

పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్..

On
క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 

క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 

పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్..

IMG-20250307-WA0556
పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్..

రంగారెడ్డి జిల్లా, మార్చి 12, న్యూస్ ఇండియా ప్రతినిధి:

ధూమపానం వీడితే?! దమ్ము కొట్టడం మానేసిన వాళ్ళే నిజమైన జీవిత విజేతలని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత, పౌర సరఫరాల సంస్థ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు.మార్చి 2వ బుధవారం జాతీయ ధూమపాన వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రఘునందన్  మాట్లాడుతూ.. పొగాకు ఉత్పత్తుల బారిన పడి ఎందరో తమ ఆరోగ్యాన్ని,తద్వారా జీవితాల్ని ఛిద్రం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూళ్ళు, కాలేజీల సమీపం లో పొగాకు ఉత్పత్తుల విక్రయాన్ని నిషేధిస్తూ .. "నో టుబాకో జొన్" గా ప్రకటించాలని కోరుతూ రాష్ట్రపతి కి లేఖ రాసినట్టు తెలిపారు.తద్వారా పొగాకు రహిత భారతాన్ని నవ తరానికి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రఘునందన్ రాష్ట్రపతి కి పంపిన ప్రార్థనలో వేడుకున్నట్టు తెలిపారు. 22 సంవత్సరాలుగా తను చేస్తున్న పొగాకు నియంత్రణ కృషి కి రాష్ట్రపతి భవన్ స్పoదిస్తుందన్న ఆశా భావం రఘునందన్ వ్యక్తం చేశారు.తల్లి దండ్రులు కూడా తమ పిల్లల్ని ఓ..కంట  కనిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని రఘునందన్ సూచించారు. ఒక వేళ పొగాకు ఉత్పత్తుల కు విద్యార్ధులు, యువత అలవాటు ఐనా..కటువుగా.. కర్కశంగా మందలించే బదులు.. ప్రేమ గా ఆప్యాయంగా మంద లిస్తే ఫలితం అద్భుతంగా ఉంటుందని రఘునందన్ అభిప్రాయ పడ్డారు.

Read More డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..

Views: 10

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి
అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం, జూలై 9: అభివృద్ధి కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ నేత...
అధికారులు సర్వే చేసి భూములకు శాశ్వత హద్దులు నిర్ణయించాలి
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్ 
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయండి