ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలి...

స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి...

On
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలి...

ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలి...

స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి...

IMG-20250402-WA1308
ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శిస్తున్న కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి...

*ఎల్బీనగర్, ఏప్రిల్ 02 (న్యూస్ ఇండియా ప్రతినిధి):* ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలని స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి రెడ్డి అన్నారు. రాత్రి సమయంలో బి.ఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఎన్జీవోస్ కాలనీ ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. రాత్రి సమయంలో వచ్చే రోగులకు సరిగ్గా వైద్యం అందిస్తున్నారా లేదా అని, అత్యవసర సమయంలో డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారా లేరు అని అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల మీద ప్రత్యేక దృష్టి పెట్టి వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలన్నారు. రోగుల ఆహార విషయంలో, చికిత్స ప్రక్రియలో ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయని అక్కడున్న వారిని అడిగి తెలుసుకోవడం జరిగింది. రాత్రి సమయంలో వచ్చే పేషంట్ల కు ఇబ్బందులు కలగకుండా మెరుగైన చికిత్సను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు మూత్రశాలలు శుభ్రపరుచుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ స్రవంతి, సిస్టర్ సంధ్య తదితరులు ఉన్నారు.

Views: 19

About The Author

Post Comment

Comment List

Latest News

పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
ఖమ్మం మే 1 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: ప్రస్తుతం ఉన్న కాలంలో వైద్యం అంటే ప్రజలు అడలెత్తిపోతున్నారు.వైద్యం పేరుతో కార్పోరేట్ వ్యవస్థ పేద ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.ఖమ్మం నగరంలో...
కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా
పది ఫలితాలలో త్రివేణి ప్రభంజనం
కలెక్టరేట్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు 
జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
ఆర్టీసీలో సమ్మె సైరన్ 
ఆర్టీసీలో సమ్మె సైరన్