'భూ భారతిని' సమర్థవంతంగా క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లాలి.

17 నుంచి 30 వరకు రైతులకు అవగాహన సదస్సులు. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.

On
'భూ భారతిని' సమర్థవంతంగా క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లాలి.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 15, న్యూస్ ఇండియా : తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక భూ చట్టం" భూభారతి" ని సమర్థవంతంగా, క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు రెవెన్యూ అధికారులకు పిలుపునిచ్చారు.  మంగళవారం కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. తేదీ :16-04-2025  రోజు బుధవారం, రెవెన్యూ అధికారులకు శిక్షణ, రైతులకు తేదీ :17 నుంచి 30 వరకు మండలాలవారీగా అవగాహన సదస్సులు వుంటాయని అన్నారు. నూతన భూభారతి పోర్టల్ ను ఓపెన్ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ ... ప్రభుత్వ ప్రతిష్టాత్మక నూతన భూ చట్టం భూభారతిని సమర్థవంతంగా క్షేత్రస్థాయిలో అమలు చేయాలని అధికారులు ఆదేశించారు. భూభారతి రైతుల సమస్యలు పరిష్కరించి, భూముల వివాదాలు లేకుండా జిల్లాను తీర్చిదిద్దా లని అన్నారు. రైతులు కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగకుండా ఉండేందుకు భూభారతిని పకడ్బందీగా అమలు చేయాలన్నారు.  రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా, గ్రామ, మండల, జిల్లా స్థాయిలో రైతులు ప్రజలు లేవనెత్తే సందేహాలకు అర్థమయ్యే భాషల్లోని సమాధానాలు చెప్పి, భూ సమస్యలకు పరిష్కారాలు చూపాలని, రెవెన్యూ అధికారులకు కలెక్టర్ సూచించారు. రైతులు  ఈ అవగాహన  కార్యక్రమాలను విజయవంతం చేయాలనీ అన్నారు.WhatsApp Image 2025-04-15 at 7.25.02 PM

Views: 8
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు.. రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు.. రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు.. రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, మార్చి 09, న్యూస్ ఇండియా ప్రతినిధి: లంచం తీసుకుంటూ...
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ 
హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్ 
ఘనంగా బొమ్మరాజు జయ యాదయ్య కుమారుని వివాహ మహోత్సవం..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన
ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి