రాజీవ్ హత్య కేసులో మరో ట్విస్ట్

On

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ఆరుగురు దోషులను విడుదల చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం సవాలు చేసింది. సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేసింది. దోషులకు ఉపశమనం కల్పిస్తూ జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్ట్ సమీక్షించాలని కోరింది. దోషులను విడుదల చేయడంపై వాదనలు వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. తగిన వాదనలు కూడా వినిపించే అవకాశం ఇవ్వకుండా దోషులను విడుదల చేయడమంటే.. సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘన జరిగినట్టు అంగీకరించడమే అవుతుందని కేంద్రం వ్యాఖ్యానించింది. […]

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ఆరుగురు దోషులను విడుదల చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం సవాలు చేసింది.

సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేసింది. దోషులకు ఉపశమనం కల్పిస్తూ జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్ట్ సమీక్షించాలని కోరింది.

దోషులను విడుదల చేయడంపై వాదనలు వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది.

తగిన వాదనలు కూడా వినిపించే అవకాశం ఇవ్వకుండా దోషులను విడుదల చేయడమంటే.. సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘన జరిగినట్టు

అంగీకరించడమే అవుతుందని కేంద్రం వ్యాఖ్యానించింది. న్యాయాన్ని నీరుగార్చినట్టేనని పేర్కొంది.

కాగా రాజీవ్ హత్య కేసులో జీవితకాల శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు దోషులు- నళిని, మురుగన్, సంథాను, రాబర్డ్ పయాస్, జయకుమార్‌లకు జైలు విముక్తి కల్పిస్తూ గతవారమే సుప్రీంకోర్ట్ ఆదేశాలిచ్చింది.

ఇతర ఏ కేసుల్లోనూ అవసరం లేకుంటే దోషులందరినీ విడుదల చేయవచ్చునని పేర్కొంది. దాంతో దాదాపు 30 ఏళ్ల తర్వాత దోషులంతా జైలు నుంచి విడుదలయ్యారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం
మహబూబాబాద్ జిల్లా:- మీడియా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ... ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని తొర్రూరు జర్నలిస్టు సంఘాల నేతలు  విమర్శించారు.  మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ...
జాతీయ యువజన దినోత్సవం
డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!
వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..
వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా
అనారోగ్య మరణించిన పీరమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం
ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం