రాజీవ్ హత్య కేసులో మరో ట్విస్ట్

On

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ఆరుగురు దోషులను విడుదల చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం సవాలు చేసింది. సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేసింది. దోషులకు ఉపశమనం కల్పిస్తూ జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్ట్ సమీక్షించాలని కోరింది. దోషులను విడుదల చేయడంపై వాదనలు వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. తగిన వాదనలు కూడా వినిపించే అవకాశం ఇవ్వకుండా దోషులను విడుదల చేయడమంటే.. సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘన జరిగినట్టు అంగీకరించడమే అవుతుందని కేంద్రం వ్యాఖ్యానించింది. […]

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ఆరుగురు దోషులను విడుదల చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం సవాలు చేసింది.

సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేసింది. దోషులకు ఉపశమనం కల్పిస్తూ జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్ట్ సమీక్షించాలని కోరింది.

దోషులను విడుదల చేయడంపై వాదనలు వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది.

తగిన వాదనలు కూడా వినిపించే అవకాశం ఇవ్వకుండా దోషులను విడుదల చేయడమంటే.. సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘన జరిగినట్టు

అంగీకరించడమే అవుతుందని కేంద్రం వ్యాఖ్యానించింది. న్యాయాన్ని నీరుగార్చినట్టేనని పేర్కొంది.

కాగా రాజీవ్ హత్య కేసులో జీవితకాల శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు దోషులు- నళిని, మురుగన్, సంథాను, రాబర్డ్ పయాస్, జయకుమార్‌లకు జైలు విముక్తి కల్పిస్తూ గతవారమే సుప్రీంకోర్ట్ ఆదేశాలిచ్చింది.

ఇతర ఏ కేసుల్లోనూ అవసరం లేకుంటే దోషులందరినీ విడుదల చేయవచ్చునని పేర్కొంది. దాంతో దాదాపు 30 ఏళ్ల తర్వాత దోషులంతా జైలు నుంచి విడుదలయ్యారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక