సీఎం పర్యటన కై సిద్ధమైన ఏర్పాట్లు.

సీఎం కు ఘనంగా స్వాగతం పలుకుదాం - మంత్రి దామోదర్ రాజనర్సింహ

On
సీఎం పర్యటన కై  సిద్ధమైన ఏర్పాట్లు.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 22, న్యూస్ ఇండియా : ఈనెల 23 న సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి అయినట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు  సురేష్ కుమార్ షట్కార్  ,జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, శాసనసభ్యులు సంజీవరెడ్డి  తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. హెలిపాడ్ ను,సీఎం చేతుల మీదుగా ప్రారంభించే బసవేశ్వర విగ్రహం, నిమ్జ్ రోడ్, కేంద్రీయ విద్యాలయ భవనం,సభ స్థలంను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హెలిప్యాడ్ పనులు, ప్రజా వేదిక సభ వేదిక, వి ఐ పి గ్యాలరీ, మీడియా గ్యాలరీ ,వాహనాల పార్కింగ్ పనులు, రూట్ల వారీగా ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రణాళిక వివరాలు, గ్రీనరీ, స్టేజి ఏర్పాట్లు, స్టేజి అలంకరణ, పరిశుభ్రత, మిషన్ భగీరథ త్రాగునీరు, టాయిలెట్స్ అన్ని పనులు  పూర్తి అయ్యాయన్నారు.  సభకు హాజరయ్యే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎస్పీ పంకజ్ పరితోష్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, ఆర్డీవోలు,జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులుపాల్గొన్నారు.WhatsApp Image 2025-05-22 at 3.25.43 PM

Views: 99
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్ సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) మార్చి 12 :జిల్లా ఎస్పీ  రోహిత్ రాజ్ ఆదేశానుసారం  యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్ లో భాగంగా 1టౌన్ సీఐ కరుణాకర్...
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..
తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు