ఉద్యమ కారులకు 250 గజాల ‘ఇంటి స్థలం’ ఎక్కడ?
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 29, న్యూస్ ఇండియా : ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ కారులకు 250 గజాల ‘ఇంటి స్థలం’ కేటాయించి కాంగ్రెస్ ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలని టీజెఏసి నాయకుల డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా సంగారెడ్డి జిల్లా కేంద్రం లోని ఐబి వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ ఉద్యమ కారులు వారి ఆవేదన వ్యక్తం చేశారు. టీజెఏసి నాయకులు మాట్లాడాతు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా ప్రభుత్వం వచ్చాక తెలంగాణ ఉద్యమ కారులకు 250 గజాల ఇంటి స్థలం కేటాయించి తెలంగాణ ఉద్యమ కారులకు గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ములో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చి 16 నెలలు గడిచిన తెలంగాణ ఉద్యమ కారులకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదని, తెలంగాణ ఉద్యమ కారులు టీజెఏసి నాయకులు అన్నారు. తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్న సబ్బండా వర్గాల ఉద్యమ కారులు ప్రొఫెసర్ కోదండరాం పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడానికి కృషి చేశారాని ‘ప్రభుత్వం’ ఈ విషయాన్ని మరిచిపోవద్దని హితవు పలికారు. వెంటనే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ కారులకు ఇచ్చిన హామీ మేరకు ఇంటి స్థలలు, పెన్షన్ సౌకర్యం కల్పించే విదంగా ఎంఎల్ సి కోదండరాం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమం తెలంగాణ ఉద్యమ కారుల లో టీజెఏసి కో చైర్మన్ కుమ్మరి సాయిలు, జి. మల్లయ్య టీజెఈసి కో ఆర్డినేటర్ శ్రీధర్ మహేంద్ర, త్రివిక్రమ్ రావు, బందేన్న గౌడ్, గొల్లరాజా రామ్, టీజెస్ నాయకులు డి. పాండు తదితరులు పాల్గొన్నారు.
Comment List