గేదె జాడ తెలిపిన వారికి పారతోషికమిస్తానంటున్న రైతు ఎందుకో తెలుసా?
న్యూస్ ఇండియా తెలుగు, జూన్ 9 (నల్గొండ జిల్లా ప్రతినిధి ): వేసవికాలం నేపథ్యంలో రోజువారీగా గేదెలను విడిచి పెట్టడంతో మేతకు వెళ్లి సాయంకాలం వేళలో తిరిగి ఇంటికి చేరుతాయి. ఎండాకాలం ముగియడంతో రైతులు నారు పోసిన యెడల గేదెలు ఇంటికే పరిమితం అవుతాయి. రోజువారీగా మేత కోసుకొని గేదెలకు వేస్తారు.ఈ నేపథ్యంలో రైతు యొక్క బర్రె దాని దూడే తప్పిపోవడంతో జాడ దొరికిన వారికి తగిన పారతోషకం ఇవ్వనున్నట్టు సోషల్ మీడియా వేదిక చేసుకుని తెలిపారు.. వారు తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ జిల్లాలోని శాలిగౌరారం మండల పరిధిలోని పావురాల గూడానికి చెందిన పరపాటి రాములు చెందిన గేదె అలాగే దానితోపాటు దూడే రోజువారీగా మేతకు వెళ్లి వచ్చేది కానీ గత నాలుగు రోజులుగా మేతకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు దాని ఖరీదు వచ్చేసి దాదాపు 70 వేల రూపాయలు వరకు ఉంటుంది.జిల్లా చుట్టుపక్కల గ్రామాల స్థానికులు ఎవరైనా తెలిసిన యెడల +91 91335 97334 ,+91 96405 56924 నెంబర్ కాల్ చేసి తెలపాలని అన్నారు తెలిసినవారికి తగినంత పారితోషకం ఇస్తానని తెలియజేశారు.ఎందుకంటే చిన్నతనం నుండి ఆ గేదె ఇంట్లో పెరిగినందువల్ల ఇస్తానని తెలిపారు.
Comment List