ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..
సమాజ శ్రేయస్సు కోసం యువత పాటుపడాలి...
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..
సమాజ శ్రేయస్సు కోసం యువత పాటుపడాలి...

నల్గొండ జిల్లా, జూన్ 09, న్యూస్ ఇండియా ప్రతినిధి: సమాజ శ్రేయస్సు కోసం యువత పాటుపడాలని గురువులు అన్నారు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న 1996 - 1997 ఎస్ఎస్సీ బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు వారు చదువుకున్న పాఠశాల ఆవరణలో ఎన్. సోమయ్య, పి. పౌలు, పి. జాన్ సుందర్, ఎం యాదయ్య, ఎం ప్రవీణ్, డి సత్యం, డి. సోమయ్య, పి. సత్యనారాయణ, పి. నాగయ్య, ఎన్. సైదులు, ఆర్. స్వామి పి. వెంకన్న ల ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు విద్యాబుద్దులు నేర్పిన ఆనాటి వారి గురువులు హర్సుధన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, సత్యవతి రెడ్డి, సత్తార్, మధు లను ఆహ్వానించి వారి ఆశీర్వాదం పొందారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయుల విద్యాబోధనను గుర్తు చేసుకొని వారిని కొనియాడారు. ఆ తర్వాత ఉపాధ్యాయులను, విద్యార్థినీ, విద్యార్థులు పూలమాల, శాలువాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో గురువులు మాట్లాడుతూ.. సమాజ శ్రేయస్సు కోసం యువత పాటుపడాలని జీవితంలో ఏ స్థాయిలో ఉన్నా కూడా తల్లిదండ్రులను,గురువులను మర్చిపోవద్దన్నారు. అనంతరం గురువులను ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. ఆర్గనైజర్స్ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వారికి అండగా ఉండాలని అన్నారు. అందరం కలిసికట్టుగా వారికి సహాయం అందించాలని సూచించారు. ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.
Comment List