సాగర్ హైవే మల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..
ముగ్గురు మృతి, నాలుగురికి గాయాలు..
రంగారెడ్డి జిల్లా, జూన్ 11, న్యూస్ ఇండియా ప్రతినిధి: యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో గిరిధర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సు కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన బుధవారం అర్ధరాత్రి మాల్ సమీపంలోని ఎస్సార్ పెట్రోల్ బంక్ వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ బాలానగర్కు చెందిన వాస సాయితేజ (22) మూసాపేట్కు చెందిన వాస పవన్ కుమార్ (25), వనస్థలిపురంకు చెందిన రాఘవేందర్ (25) మరో నలుగురు స్నేహితులతో కలిసి వైజాగ్ కాలనీకి వెళ్లారు. తిరిగు ప్రయాణంలో హైదరాబాద్ కు

వస్తుండగా.. మాల్ సమీపంలోని మైసమ్మ దేవాలయం దాటి ఎస్సార్ పెట్రోల్ బంకు వద్దకు చేరుకోగానే నాగార్జునసాగర్ వైపు వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వచ్చి కాను బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు స్పాట్లోనే మృతి చెందారు. వాస శివకుమార్, వాస సాయికుమార్, ఎం.సందీప్, శివ కుమార్లకు తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు వారిని చికిత్స కోసం నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Comment List