త్రివేణి పాఠశాల 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

On
త్రివేణి పాఠశాల 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

IMG-20250623-WA1155 కొత్తగూడెం( న్యూస్ ఇండియా బ్యూరో నరేష్):లక్ష్మీదేవిపల్లిలో గల త్రివేణి పాఠశాలల ప్రాంగణంలో త్రివేణి పాఠశాల 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి, గౌరవ సలహాదారుడు గొల్లపూడి ప్రకాశరావు  పాల్గొన్నారు. గడిచిన 31వ సంవత్సరాలలో సాధించిన విజయ పరంపర పుస్తక ఆవిష్కరణ నలుగురు డైరెక్టర్ల సమక్షంలో జరిగినది. వీరేంద్ర  మాట్లాడుతూ ఈ విజయాత్రను మున్ముందుకు సాగించి అత్యున్నత ఫలితాలతో శిఖరాగ్రాలను అధిరోహించాలని త్రివేణి పాఠశాలల డైరెక్టర్ డా,,గొల్లపూడి వీరేంద్రచౌదరి ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో త్రివేణి-కృష్ణవేణి డైరెక్టర్ జి. జగదీష్, మాచవరపు కోటేశ్వరరావు, వై.వెంకటేశ్వరావు, సి.ఆర్.ఓ. కాట్రగడ్డ మురళీ కృష్ణ, చీకటి అప్పారావు, ప్రిన్సిపాల్స్ శ్రీనివాస్ సింగ్, రామ్మూర్తి మరియు వైస్ ప్రిన్సిపాల్స్ సౌజన్య ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Views: 1
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News