అధిక ఫీజులు వసూలుకు పాల్పడుతున్న నారాయణ విద్యాసంస్థలను బ్యాన్ చేయాలి
నారాయణ పాఠశాల ఎదుట ఆందోళనకు దిగిన ఏఐఎస్ఎఫ్
పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్ లు ఉన్న రూమ్ ను సీజ్ చేసిన ఎంఈఓ శ్రీరామ్ మూర్తి
పాల్వంచ( న్యూస్ ఇండియా బ్యూరో నరేష్): అధిక ఫీజులు వసూలు చేస్తున్న నారాయణ పాఠశాలను రద్దు రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫహీమ్ దాదా డిమాండ్ చేశారు. ఫీజుల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ స్టేషనరీ పేరుతో బుక్ స్టాల్ ఏర్పాటు చేసుకొని లక్షలాది రూపాయలు విద్యార్థులు తల్లిదండ్రుల నుండి వసూలు చేస్తున్న ఈ విషయంపై మంగళవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నారాయణ పాఠశాల ఎదుట బేటాయించి ఆందోళన నిర్వహించారు. విద్యార్థి సంఘం నాయకులు చారువాణి ద్వారా జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి కి సమాచారం అందించారు. స్థానిక ఎంఈఓ శ్రీరామ్మూర్తి పాఠశాల వద్దకు చేరుకొని స్టేషనరీ పాఠశాల యూనిఫామ్ లు ఉంచిన రూమ్ ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫహీమ్ దాదా మాట్లాడుతూ ఫీజుల నియంత్రణ చట్టం తుంగలో తొక్కి అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థి తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్న విద్యాశాఖ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. పేద విద్యార్థి తల్లిదండ్రులను ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఆసరాగా చేసుకొని కాసులు వసూలుకు పాల్పడుతున్న విద్య హక్కు చట్టాన్ని తుంగలో తొక్కి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజులు వివరాలను నోటీసు బోర్డులో ఉంచాలినీ, విద్య హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఎస్సీ ఎస్టీ బీసీ వికలాంగులు పేదల వర్గాల విద్యార్థులకు 25% పీజి రాయితీ ఇవ్వాలని నిబంధనలు ఉన్నప్పటికీ ఈ నిబంధనలను నారాయణ పాఠశాల నిర్వాహకులు ఏ కోశానా అమలు చేయడం లేదన్నారు. (జీవో నెంబర్ 42)2010 ప్రకారం డొనేషన్లు క్యాప్టేషన్ ఫీజులు వసూలు చేయకూడదని, ఆట స్థలం తప్పనిసరిగా మున్సిపాలిటీ పరిధిలో 1000 చదరపు మీటర్లు ఉండాలని నిబంధనలు ఉన్నా ఆ నిబంధన తుంగలో తొక్కి తముష్టానుసారంగా వ్యవహరిస్తున్న జిల్లా విద్యాశాఖ మాత్రం నిమ్మకు నిరత్తినట్టుగా వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటని, విద్యాశాఖ అధికారుల అనుమతులతోనే అదనపు ఫీజులు వసూలు చేస్తున్నామని బహిరంగంగా యాజమాన్యం చెప్పడం వెనక ఆంతర్యం ఏంటని ఆయన ప్రశ్నించారు. తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై దాడులు నిర్వహించి పర్మిషన్ లేనటువంటి విద్యాసంస్థలను తక్షణమే సీజ్ చెయ్యాలని లేనిపక్షంలో దాడులు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి వర్క అజిత్, జిల్లా ఉపాధ్యక్షులు గుండాల సుజన, ఇనపల్లి పవన్ సాయి, నాయకులు అక్కినపల్లి నాగేంద్రబాబు, వినయ్, వంశీ, మహేష్, కళ్యాణ్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
Comment List